పిడుగుపాటుకు గురైన బచ్చుపేట వేంకటేశ్వరస్వామి ఆలయం
Published Monday, 30 May 2016మచిలీపట్నం, మే 29: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ప్రసిద్ధిగాంచిన బచ్చుపేట శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంపై ఆదివారం తెల్లవారుజామున పిడుగు పడింది. పిడుగుపాటుకు ఆలయ గాలి గోపురం స్వల్పంగా ధ్వంసమైంది. శనివారం అర్ధరాత్రి పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆదివారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో ఆలయ గాలి గోపురంపై పడిన పిడుగుపాటు పట్టణ వాసులను ఉలికిపాటుకు గురి చేసింది. పిడుగు ధాటికి గాలి గోపురం స్వల్పంగా ధ్వంసమై 100 మీటర్ల దూరంలో శకలాలు పడ్డాయి. తెల్లవారుజామున పిడుగు పడటంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఆ సమయంలో భక్తులెవరూ లేకపోడంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.