పేదరికమే నా కులం
Published Monday, 30 May 2016తిరుపతి, మే 29: ‘పేదరికం నా కులం.. నా మతం. పేదరికం ఎక్కడుంటే నేను అక్కడుంటా. పేదరిక నిర్మూలనే నా లక్ష్యం, సంకల్పం’ అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మూడు రోజులపాటు సాగిన టిడిపి మహానాడు ముగింపు సభలో ఆయన గంటకు పైగా ఉద్వేగంగా ప్రసంగించారు. కాంగ్రెస్, వైకాపాలపై విమర్శలతో విరుచుకుపడ్డ బాబు కెసిఆర్పై పెదవి విప్పకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్న విషయాన్ని వివరించారు. విదేశాల నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వివిధ పరిశ్రమలు ఎలా ముందుకు వస్తున్నాయో వివరించారు.