మంద కృష్ణమాదిగ రథయాత్రను అడ్డుకుంటాం
Published Saturday, 28 May 2016రాజమహేంద్రవరం, మే 27: సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలంగాణాకు మద్దతు ప్రకటించిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారిపల్లె నుంచి చేపట్టిన రథయాత్రను అడ్డుకుంటామని ఎపి ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు చెప్పారు. శుక్రవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ మాదిగల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, చర్మకారులకు ఉపాధి కల్పించే నిడ్క్యాప్ను పునరుద్ధరించాలని, సంక్షేమ పథకాల్లో వర్గీకరణను వర్తింపజేసే జిఓ 25ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు చైతన్య యాత్ర చేపట్టినట్లు చెప్పారు.