ముగ్గురు దోపిడీ దొంగలు అరెస్ట్
Published Saturday, 28 May 2016తిరుపతి, మే 27: స్థానిక వైకుంఠపురంలో ఈనెల 5వ తేదీన రిటైర్డ్ టిటిడి ఇ ఇ ప్రభాకర్పై దాడిచేసి విలువైన బంగారు ఆభరణాలు, రెండు సెల్ఫోన్లను దొంగిలించిన ముగ్గురు దోపిడీ దొంగలను తిరుపతి క్రైం పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. తిరుపతి క్రైం ఏఎస్పీ సుబ్బారెడ్డి అదేశాల మేరకు డిఎస్పీ కొండారెడ్డి ఆధ్వర్యంలో నిందితులను ఎమ్మార్పల్లి వద్ద ఉన్న ఉప్పరపల్లి క్రాస్ వద్ద నిందితులను అరెస్టుచేశారు.