రాయలసీమ దత్తపుత్రుడు మన్రో
Published Saturday, 28 May 2016అనంతపురం కల్చరల్, మే 27 : రాయలసీమ అభివృద్ధికి విశేష కృషి చేసిన సర్ థామస్ మన్రో రాయలసీమ దత్తపుత్రుడిగా చరిత్రలో నిలిచిపోయారని జెసి బి.లక్ష్మీకాంతం కొనియాడారు. దత్త మండలాల తొలి ప్రిన్సిపల్ కలెక్టర్గా పనిచేసిన సర్ థామస్ మన్రో జయంతి వేడుకలను శుక్రవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పెన్నార్ భవన్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.