S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/18/2018 - 01:45

న్యూఢిల్లీ, జూలై 17: ఇండోనేషియాలోని జకార్తాలో జరిగే ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా దిగుతున్న భారత హాకీ జట్టు ఆచి తూచి ఆడాల్సిన అవసరమెంతైనా ఉందని పురుషుల జట్టు కోచ్ హరేంద్ర సింగ్ అన్నాడు. ఆగస్టులో ప్రారంభమయ్యే ఆసియా క్రీడల్లో భారత్ తలపడే జట్లను తాము తక్కువగా అంచనా వేయబోమన్నాడు. కొన్ని జట్లు తమకు గట్టి పోటీ ఇస్తాయని బలంగా నమ్ముతున్నట్టు చెప్పుకొచ్చాడు.

07/17/2018 - 00:43

లండన్: నెంబరింగ్ కాదు, సిరీస్ ముఖ్యం అంటున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్. మిడిలార్డర్‌ను పటిష్టం చేస్తే సిరీస్ మనదే అన్న వ్యూహంతో ఉన్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ట్రై సిరీస్‌లో చెరో మ్యాచ్ సొంతం చేసుకోవడంతో, చివరి మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. మంగళవారం మ్యాచ్‌పై కోహ్లీ సేన ప్రత్యేక దృష్టిపెట్టింది.

07/17/2018 - 00:39

పారిస్, జూలై 16: ఏమైతేనేం. 20ఏళ్ల కలను సాకారం చేసిన జాతీయ జట్టు మహదానంతో మాస్కోను వీడింది. ఒక్కో ఆటగాడు ఒక్కో ఈఫిల్ టవర్‌లా స్వదేశానికి బయలుదేరారు. దిగ్గజాలను దిక్కులదిరేలా రిసీవ్ చేసుకోడానికి లక్షలాది ఫ్రాన్స్‌వాసులు సిద్ధమయ్యారు. స్వదేశాన్ని ముస్తాబు చేశారు. ఈఫిల్ టవర్ వెలిగిపోతోంది. ఆర్క్ డె ట్రోంఫె ధగధగలాడుతోంది. ఎక్కడ చూసినా జాతీయ జెండాలోని నీలం, తెలుపు, ఎరుపు రంగుల శోభే కనిపిస్తోంది.

07/17/2018 - 00:40

న్యూఢిల్లీ, జూలై 16: భారత మహిళా క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్‌గా మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్‌ను బీసీసీఐ నియమించింది. ఇటీవల భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్‌గా పనిచేసిన తుషార్ అరోథి గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో పవార్‌కు తాత్కాలిక కోచ్ బాధ్యతలు అప్పగించింది. మహళా క్రికెట్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా బిజూ జార్జ్ కొనసాగుతున్నాడు. జూలై 25నుంచి బెంగుళూరులో భారత మహిళా జట్టు శిక్షణ శిబిరం కొనసాగుతోంది.

07/16/2018 - 23:53

లండన్, జూలై 16: లండన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్ గ్రాండ్ శ్లామ్ టైటిల్ దక్కించుకున్న 31ఏళ్ల సెర్బియా టెన్నిస్ స్టార్ ఆటగాడు నవోక్ జొకోవిచ్ ఇపుడు యూఎస్ ఓపెన్‌పై కనే్నశాడు. వింబుల్డన్ టోర్నీల్లో 2011లో తొలిసారి చాంపియన్‌గా అవతరించిన జొకోవిచ్, ఆ తర్వాత 2014, 2015ల్లో సైతం టైటిల్ సాధించాడు.

07/16/2018 - 23:53

న్యూఢిల్లీ, జూలై 16: సెర్బియాలో జరుగుతోన్న 36వ గోల్డెన్ గ్లోవ్ ఆఫ్ వొజోదినా యూత్ బాక్సింగ్ టోర్నీలో భారత్ బాక్సర్లు ఏడు స్వర్ణాలు సాధించారు. 13 స్వర్ణాల లక్ష్యంతో ఫైనల్ బరిలోకి దిగిన భారత బాక్సర్లకు, ప్రత్యర్థి బాక్సర్లు గట్టి పోటీనివ్వడంతో ఏడు స్వర్ణాలకే పరిమితం కావాల్సి వచ్చింది.

07/16/2018 - 23:52

న్యూఢిల్లీ, జూలై 16: బ్రెసీయా (బ్రెజిల్)లో జరిగిన 7వ వరల్డ్ జూనియర్ ఉషూ చాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగు రజితాలు, ఐదు కాంస్యాలు కలిపి 9 పతకాలు సాధించింది. చాంపియన్‌షిప్ సన్షో విభాగంలో బాబులు (42 కిలోలు, సబ్ జూనియర్), సలీం (56కిలోలు, సబ్ జూనియర్), సవిత (48 కిలలోలు, జూనియర్), హిమాంషు (56 కిలోలు, జూనియర్), శృతి (60కిలోలు), జాన్వి (52 కిలోలు, జూనియర్) రజిత పతకాలు సాధించారు.

07/16/2018 - 23:51

మాస్కో, జూలై 16: ఓటమి బాధ పంటి బిగువన భరిస్తుంటే, బంగారు బంతి ఆనందం తియ్యగానే తోచిందని క్రొయేషియా కెప్టెన్ లుకా మాడ్రిక్ అన్నాడు. వ్యక్తిగత గుర్తింపు గోరంత తీపినిస్తే, ప్రపంచపోరులో ఓటమి కొండంత బాధ మిగిల్చిందని అభిప్రాయపడ్డాడు. ‘గుర్తింపును ఎవరు మాత్రం వద్దంటారు. సహజంగా ఎవరికైనా ఇష్టమే. ఉత్తమ ఆటగాడిగా ‘గోల్డెన్ బాల్’ గుర్తింపునివ్వడం ఆనందంగానే ఉంది.

07/16/2018 - 23:49

పారిస్, జూలై 16: ఫిఫా ప్రపంచకప్ సాధించుకొస్తున్న జాతీయ జట్టు ఆటగాళ్లకు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం ‘లీజియన్ ఆఫ్ ఆనర్’ను ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘అనిర్వచనీయ సేవలందించిన వారికిచ్చే దేశ అత్యున్నత పురస్కారం లీజియన్ ఆఫ్ ఆనర్‌ను ఆటగాళ్లకు ప్రదానం చేయనున్నాం’ అని పేర్కొంది.

07/16/2018 - 02:48

పసికూనగా బరిలోకి దిగి కసికూన అనిపించుకున్న క్రొయేషియా -ఫ్రాన్స్ ముందు మాత్రం పసికూనగానే మిగిలిపోయంది. మాజీ చాంపియన్ ముందు క్రొయేషియా ఉరకలు కుప్పిగంతుల్లాగే మిగిలిపోయాయ. సంచలనాల సాకర్‌లో ఏమైనా జరగొచ్చన్న చిన్న ఆశ ప్రపంచ అభిమానులను క్రొయేషియాకు ఫ్యాన్స్ చేసింది. చరిత్ర తిరగరాసేందుకు ఉవ్విళ్లూరిన జెయంట్ కిల్లర్స్.. దిగ్గజ జట్టుముందు నిలవలేకపోయారు.

Pages