-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
కోల్కతా, జూలై 19: ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చేతి వేలికి తగిలిన గాయంతో కోలుకుంటున్న భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా ఇపుడు భుజం నొప్పితో బాధపడుతున్నాడు.
న్యూఢిల్లీ, జూలై 19: ఉత్తరప్రదేశ్లో ఆటగాళ్ల ఎంపికలో లంచం తీసుకుని అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, అతని వ్యక్తిగత సిబ్బంది రాజీనామా చేయాలని ఒత్తిడి వస్తోంది.
న్యూఢిల్లీ, జూలై 19: ఫ్రాన్స్లో జరుగుతున్న సొట్టివిల్లే అథ్లెటిక్స్ మీట్లో భారత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. జావెలిన్ త్రో ఫైనల్లో రికార్డు స్థాయిలో 85.17 మీటర్లు విసిరిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణ పతకం చేజిక్కించుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్ విజేత చాంపియన్ వాల్కాట్ ఐదో స్థానంలో నిలిచాడు. నీరజ్ అద్వితీయమైన ప్రతిభను కనపరిచి జావెలిన్ను 85 మీటర్లు విసిరి రికార్డు నెలకొల్పాడు.
ముంబయి, జూలై 19: హాంకాంగ్ టెన్నిస్ టోర్నమెంట్లో విజయం సాధించడంతో తనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని భారత టెన్నిస్ క్రీడాకారిణి కర్మన్ కౌర్ తండి ధీమా వ్యక్తం చేసింది. ఇదే ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ఇండోనేషియాలో ఆగస్టు 18 నుంచి జరుగనున్న ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్లో పాల్గొంటున్నట్లు ఈ 20 ఏళ్ల కర్మన్ కౌర్ తెలిపింది.
లండన్, జూలై 19: వచ్చే నెల 1 నుంచి 5 వరకు భారత్తో బర్మింగ్హామ్లో జరిగే తొలి టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మన్, డైనమిక్ మిడిల్ ఫీల్డర్ బెన్ స్టోక్స్ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది.గత ఏడాది సెప్టెంబర్లో బ్రిస్టోల్లోని నైట్క్లబ్ బయట జరిగిన ఒక సంఘటనలో బాధ్యుడిని చేస్తూ బెన్స్టోక్స్ను ప్రాసిక్యూషన్ విచారణకు ఆదేశించింది.
న్యూఢిల్లీ, జూలై 19: ఆసియా గేమ్స్లో పాల్గొనే క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించే దిశగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు శుక్రవారం ఐఓఏ సంబంధిత కోర్, లీగల్ కమిటీలతో సమావేశం కానుంది. రానున్న ఆసియా క్రీడల్లో మరిన్ని పతకాలు సాధించేందుకు వీలుగా క్రీడాకారుల ఎంపికలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను సరళతరం చేసే విషయమై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చంచనున్నారు.
లీడ్స్: ఇంగ్లాండ్తో టీమిండియా ఆడబోయే తొలి మూడు టెస్ట్ల మ్యాచ్ల జట్టులో కుర్ర వికెట్ కీపర్- బ్యాట్స్మన్ రిషబ్ పంత్కు చోటుదక్కింది. అదే సమయంలో ఫైవ్ డే ఫార్మాట్కు సీనియర్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మను దూరంపెట్టారు. అంతా ఊహించినట్టే ఇంగ్లాండ్తో ఆడబోయే ఐదు టెస్ట్ల సిరీస్ జట్టును బీసీసీఐ ప్రకటించలేదు. మొదటి మూడు టెస్ట్ల్లో ఆడబోయే 18మంది సభ్యుల జట్టును మాత్రమే బుధవారం ప్రకటించింది.
దుబాయి, జూలై 18: బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, బౌలింగ్లో బుమ్రాలే ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్నారు. భారత్- ఇగ్లాండ్ మధ్య వనే్డ ట్రై సిరీస్ ముగిసిన తరువాత బుధవారం ఐసీసీ ర్యాకింగ్స్ ప్రకటించింది. భారత పరుగులు యంత్రం కోహ్లీ అత్యధికంగా 911 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
లీడ్స్, జూలై 18: సమతుల్యత, సమష్టి కృషి ఒక్కటే టీమిండియా ముందున్న టాస్క్ అని స్కిప్పర్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమతుల్యత సాధించి, విజయం కోసం మరింత సమష్టి కృషి జరపాల్సి ఉందన్నాడు. వచ్చే ప్రపంచకప్ నాటికి తప్పిదాలను సరిదిద్దుకుంటామని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్తో వనే్డ ట్రై సరిస్ను 1-2తో పోగొట్టుకున్న అనంతరం కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
చెన్నై, జూలై 18: ఇండోనేసియాలో జరగబోయే ఆసియా గేమ్స్లో భారత కబడ్డీ జట్టు ఎనిమిదో స్వర్ణ పతకం సాధించడం ఖాయమని జట్టు కెప్టెన్ అజయ్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశాడు. ఆసియా గేమ్స్లో ఇరాన్, పాకిస్తాన్ జట్లనుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉండొచ్చని అన్నాడు. ‘ఆసియా గేమ్స్లో భారత కబడ్డీ పురుషుల, మహిళా జట్లు 8, 3వ స్వర్ణ పతకాలు సాధించడం ఖాయం’ అన్నాడు. ‘మనవాళ్లు స్థిరమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు.