-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
కోల్కతా, సెప్టెంబర్ 29: ఈడెన్ గార్డెన్స్లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో హర్భజన్ సింగ్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అతను మొత్తం 46 వికెట్లు కూల్చాడు. అనిల్ కుంబ్లే 40, బిషన్ సింగ్ బేడీ 29 చొప్పున వికెట్లు తమ ఖాతాల్లో వేసుకున్నారు. విదేశీ బౌలర్లలో ఆస్ట్రేలియాకు చెందిన రిచీ బనార్డ్ ఎక్కువగా 18 వికెట్లు పడగొట్టాడు.
సెంచూరియన్, సెప్టెంబర్ 29: దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్ల వనే్డ సిరీస్ ఆస్ట్రేలియా బౌలింగ్కు పరీక్ష పెట్టనుంది. శుక్రవారం జరిగే మొదటి వనే్డలో ఆసీస్ తరఫున ముగ్గురు కొత్త ఫాస్ట్ బౌలర్లు బరిలోకి దిగడమే అందుకు కారణం. డానియల్ వోరల్ ఇప్పటికే ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో సత్తా చాటాడు. క్రిస్ ట్రెమెన్, జో మెనీ కూడా సమర్థులైన బౌలర్లుగా ఎదుగుతున్నారు.
కోల్కతా, సెప్టెంబర్ 29: బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి)కి అధ్యక్షుడిగా ఉన్న ‘కోల్కతా ప్రిన్స్’ సౌరవ్ గంగూలీ గురువారం లిఫ్ట్లో చిక్కుకుపోయాడు. సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మొదటి అంతస్థులో ఉన్న సిఎబి కార్యాలయానికి వెళ్లడానికి దాదా లిఫ్ట్ ఎక్కాడు. అయితే, అది మధ్యలోనే ఆగిపోయింది. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
సిడ్నీ, సెప్టెంబర్ 28: బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మాక్స్ వాకర్ చర్మ సంబంధ కేన్సర్ వ్యాధితో మృతి చెందాడు. అతని వయసు 68 సంవత్సరాలు. కెరీర్లో 34 టెస్టులు ఆడిన అతను 138 వికెట్లు పడగొట్టాడు. 17 వనే్డ ఇంటర్నేషనల్స్లో 20 వికెట్లు కూల్చాడు. వాకర్ను ఆసీస్ మాజీ బౌలర్గా కంటే ప్రతిభావంతుడైన కామెంటేటర్గా, టీవీ ప్రెజెంటర్గా చాలా మందికి తెలుసు.
సియోల్, సెప్టెంబర్ 28: కొరియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్లో మొదటి రౌండ్లోనే కీలక ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. అతనితోపాటు పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్, తన్వీ లాడ్ కూడా తమతమ మొదటి రౌండ్ మ్యాచ్ల్లోనే పరాజయాలను చవిచూసి, టోర్నీ నుంచి నిష్క్రమించారు. కాగా, అజయ్ జయరామ్, సాయి ప్రణీత్ మొదటి రౌండ్ను సమర్థంగా పూర్తి చేసి, భారత్ తరఫున పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
అబూదబీ, సెప్టెంబర్ 28: వెస్టిండీస్తో జరిగిన మూడవ, చివరి మ్యాచ్ని కూడా గెల్చుకున్న పాకిస్తాన్ ఈ సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. మొదటి రెండు మ్యాచ్ల్లో విజయాలను నమోదు చేసి, సిరీస్ను దక్కించుకున్న పాక్ చివరి మ్యాచ్లోనూ ఆధిపత్యాన్ని కనబరచింది. స్పిన్నర్ ఇమాద్ వసీం 21 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టడంతో విండీస్ను పాక్ 103 పరుగులకే కట్టడి చేసింది.
అబూదబీ, సెప్టెంబర్ 28: వెస్టిండీస్తో జరిగిన మూడవ, చివరి మ్యాచ్ని కూడా గెల్చుకున్న పాకిస్తాన్ ఈ సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. మొదటి రెండు మ్యాచ్ల్లో విజయాలను నమోదు చేసి, సిరీస్ను దక్కించుకున్న పాక్ చివరి మ్యాచ్లోనూ ఆధిపత్యాన్ని కనబరచింది. స్పిన్నర్ ఇమాద్ వసీం 21 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టడంతో విండీస్ను పాక్ 103 పరుగులకే కట్టడి చేసింది.
కోల్కతా, సెప్టెంబర్ 28: న్యూజిలాండ్తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం భారత క్రికెటర్లు ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బుధవారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. మొదటి టెస్టులో ఇద్దరు స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజా రూపంలో జట్టులో ఆడగా, రెండో టెస్టుకు అమిత్ మిశ్రాను కూడా తీసుకుంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: పాలనా వ్యవహారాలన్నీ పారదర్శకంగా జరగాలన్న ఉద్దేశంతో లోధా కమిటీ చేసిన సిఫార్లును అమలుచేయడానికి నిరాకరిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)పై సుప్రీం కోర్టు మండిపడింది. లోధా కమిటీ బుధవారం సమర్పించిన స్టేటస్ రిపోర్టులపై తీవ్రంగా స్పందించిన కోర్టు ఇప్పటికైనా దారిలోకి రావాలని సూచించింది.
కోల్కతా, సెప్టెంబర్ 28: జాతీయ సీనయర్ సెలక్షన్ కమిటీ నుంచి గగన్ ఖోడా, జతిన్ పరాంజపేలకు బిసిసిఐ ఉద్వాసన పలకనున్నట్టు తెలుస్తోంది. బోర్డు వర్గాలు అనధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం, సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురికావడం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. కోర్టుతో ఘర్షణ వైఖరిని అవలంభించరాదన్న నిర్ణయానికి వచ్చిన బోర్డు అధికారులు జాతీయ సెలక్షన్ కమిటీని ముగ్గురు సభ్యులకు కుదించాలని నిర్ణయించారు.