S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కైకలూరు, డిసెంబర్ 3: నియోజకవర్గ ప్రజలంతా తనను ఆశీర్వదించి నాడు గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనని, ప్రజాభీష్టాన్ని గౌరవించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు వైద్య, ఆరోగ్య, వైద్య విద్య శాఖ మంత్రి పదవిని ఇచ్చారని, వైద్య ఆరోగ్య శాఖలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి సర్కారు దవాఖానాలో పేదలందరికీ మెరుగైన వైద్యమందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే, వైద్య ఆరోగ్య, వైద్
హైదరాబాద్, డిసెంబర్ 3: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నవ్వులాటగా మారిందని ఎఐసిసి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని క్యాష్లెస్ కాదు జాబ్ లెస్గా మారుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. శనివారం హైదరాబాద్కు వచ్చిన అభిషేక్ సింఘ్వి గాంధీభవన్లో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.
సిద్దిపేట, డిసెంబర్ 3: టిఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని నీటి పారుదల శాఖమంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హామీల అమలుకోసం కాంగ్రెస్ నేతలు ఈనెల 5న దీక్ష చేస్తామని ప్రకటించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. టిఆర్ఎస్ పై విమర్శలు చేయడం సూర్యుని మీద ఉమ్మివేయడమేనన్నారు.
విజయవాడ, డిసెంబర్ 3: సమాజంలో విభిన్న ప్రతిభావంతులు ఎవరికీ తక్కువ కాదని అవకాశాలు కల్పిస్తే అందలం ఎక్కగలరని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఏ తప్పూ చేయకపోయినా ఇలా జన్మించామంటూ ఏ ఒక్కరూ అధైర్యపడవద్దని, ఇతరులను నిందిస్తూ బాధపడవద్దు.. అండగా నేనున్నానంటూ హర్షధ్వానాల మధ్య భరోసా ఇచ్చారు.
హైదరాబాద్, డిసెంబర్ 3: హైదరాబాద్లో నకిలీ కరెన్సీ, దృష్టి మళ్లించడం, రాగి చెంబులో డబ్బు పెడితే ధనం పెరుగుతుందంటూ అమాయక ప్రజలను మోసగిస్తున్న బెంగళూరు ముఠాను శనివారం సౌత్జోన్ పోలీసులు అరెస్టు చేశారు. రెయిన్ బజార్ పోలీసుల అదుపులో నలుగురు ముఠా సభ్యులు ఉండగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు డిసిపి వి సత్యనారాయణ తెలిపారు. నిందితుల నుంచి రూ.
తిరుపతి, డిసెంబర్ 3: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన శనివారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు విశేష అలంకరణ భూషితురాలై రథాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఓవైపు వర్షం కురుస్తున్నా భక్తులు గోవిందనామ స్మరణచేస్తూ రథాన్ని ముందుకు లాగి తమ భక్తిని చాటుకున్నారు.
భద్రాచలం, డిసెంబర్ 3: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పిఎల్జిఏ వారోత్సవాలు హింసాత్మకంగా మారాయి. నక్సల్స్ వారోత్సవాలు విజయవంతం చేయాలంటూ కరపత్రాలు, బ్యానర్లు ఏర్పాటు చేసి వాటి కింద ప్రెషర్ బాంబులు పెడుతున్నారు.
తిరుపతి, డిసెంబర్ 3: తమ బంగారు భవిష్యత్తు ఏమిటంటూ మహిళామణులు ప్రభుత్వ తీరుపై కనె్నర్ర చేశారు. శనివారం తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద వైకాపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా మహిళామణులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓవైపు జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా మహిళలు నిరసన వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం, డిసెంబర్ 3: గిరిజనుల సాంప్రదాయాలు, సంస్కృతి, అస్తిత్వాన్ని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథ్ పిలుపునిచ్చారు.
కర్నూలు, డిసెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం, బ్యాంకులు, ఎటిఎంలలో నగదు కొరత నేపధ్యంలో ఆన్లైన్ కొనుగోళ్లకు సిద్ధపడిన ప్రజలకు బ్యాంకు సర్వర్లు చుక్కలు చూపిస్తున్నాయి. ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువుల బిల్లుల చెల్లింపులకే కాకుండా దుకాణాల్లో కొనుగోళ్ల అనంతరం స్వైపింగ్ యంత్రాల ద్వారా బిల్లు చెల్లిద్దామంటే అవి కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది.