S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/25/2016 - 05:16

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 24: ప్రకృతి అందాలతో అలరారే తూర్పు గోదావరి జిల్లాలను టూరిజం హబ్‌గా మార్చుతామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గోదావరి నది మహా పుష్కరాల సమయంలో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టును రూ.100 కోట్ల నిధులతో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

09/25/2016 - 05:13

తిరుపతి, సెప్టెంబర్ 24: ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో శనివారం చిత్తూరు జిల్లాలో ప్రజలకు అంటువ్యాధులు సోకకుండా దోమలపై యుద్ధం ప్రకటించి ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించింది.

09/25/2016 - 05:10

కడప,సెప్టెంబర్ 24: ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనే ప్రభుత్వ ధ్యేయమని, వ్యక్తిగత శ్రద్ధతో రోగాలు వ్యాపించకుండా చూసుకోవాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం స్థానిక స్టేట్ గేస్టు హౌస్ నుంచి పాత కలెక్టర్ కార్యాలయం వరకు దోమలపై దండయాత్ర- పరిసరాల పరిశుభ్రత అనే అంశంపై ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిందన్నారు.

09/25/2016 - 05:05

అనంతపురం కల్చరల్, సెప్టెంబర్ 24: దోమ రహిత జిల్లాగా అనంతను మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈమేరకు నగరంలో శనివారం నిర్వహించిన దోమలపై దండయాత్ర అవగాహన ర్యాలీని మంత్రి కామినేని ప్రారంభించారు.

09/25/2016 - 05:04

ఆత్మకూరు, సెప్టెంబర్ 24: ఆత్మకూరు-కూడేరు మండల సరిహద్దులోని తిమ్మాపురం గ్రామం వద్ద హంద్రీనీవా కాలువ నుంచి మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కామినేని శ్రీనివాసులు, మంత్రి పల్లె రఘునాథరెడ్డిలు శనివారం రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల పరిధిలోకి నీటిని విడుదల చేశారు.

09/25/2016 - 05:02

విజయవాడ, సెప్టెంబర్ 24: ఏపిసిఆర్‌డిఎ పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధన నిమిత్తం తగు సహకారం అందించే దిశగా ఏపిసిఆర్‌డిఏ డెవలప్‌మెంట్ సెంటర్‌ను శనివారం సంస్థ విజయవాడ కార్యాలయంలో ప్రారంభించింది. కృష్ణా, గుంటూరు జిల్లాలు రాజధాని ప్రాంతంలో ఉన్నందున ఈ ప్రాంతం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.

09/25/2016 - 05:02

విజయవాడ, సెప్టెంబర్ 24: నిరుపేదలకు ఇ-కామర్స్ విధానం అలవర్చాలని ఉద్దేశంతో నగదు రహిత నిత్యావసర సరుకుల పంపిణీ విధానానికి జిల్లాలో శ్రీకారం చుట్టినట్లు జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు ప్రపంచ బ్యాంక్ డాక్యుమెంటేషన్ బృందానికి వివరించారు.

09/25/2016 - 05:01

విజయవాడ, సెప్టెంబర్ 24: పరిసరాల్లోను, ఇళ్లలోను పరిశుభ్రత పాటించడం ద్వారా రాష్ట్రాన్ని దోమలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థానిక 45వ డివిజన్, మధురానగర్‌లో శనివారం నిర్వహించిన ‘దోమలపై దండయాత్ర - పరిసరాల పరిశుభ్రత’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

09/25/2016 - 05:01

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 24: పోలీసు, ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పని చేస్తూ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా కృషి చేయాలని జాయింట్ పోలీసు కమిషనర్ పి హరికుమార్ పేర్కొన్నారు. ఇదే సమయంలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. హనుమాన్‌పేటలో కృష్ణాజిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నెలవారీ సమీక్ష సమావేశం శనివారం జరిగింది.

09/25/2016 - 05:00

విజయవాడ, సెప్టెంబర్ 24: జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకం, ఈ దశలో తీసుకునే నిర్ణయాలు చేసే పనుల వల్లనే జీవితంలో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడతాయి. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ యువజనోత్సవాల్లో భాగంగా యంగ్ వింగ్స్ పేరుతో నగరంలోని పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో రెండురోజులపాటు జరిగే వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి.

Pages