-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
లండన్, సెప్టెంబర్ 4: ఇంగ్లాండ్లో ఉన్నత విద్యను అభ్యసించదలిచే భారతీయ విద్యార్థుల కోసం కొత్తగా పోస్ట్ స్టడీ వీసా విధానాన్ని అమలు చేయాలని ఆ దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు మంగళవారం ఇక్కడ ప్రతిపాదించారు.ప్రతియేటా భారత్ లాంటి దేశాల నుంచి ఈ దేశానికి వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్న తరుణంలో విదేశీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు గాను కొత్త వీసా విధానాన్ని అమలు చేయాలని అక్కడి
ఇస్లామాబాద్, సెప్టెంబర్ 4: పాకిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా డాక్టర్ ఆరిఫ్ అల్వీ (69) ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన డాక్టర్ ఆరీఫ్ దేశ 13వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
వాషింగ్టన్, సెప్టెంబర్ 4: చికాగోలో ఈనెల 7 నుంచి 9 వరకూ మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ హిందూ కాంగ్రెస్ సభలు(డబ్ల్యూహెచ్సీ)లకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి హిందూ సంస్థలకు చెందిన ప్రముఖులు సభలకు విచ్చేయనున్నారు. ఏకంగా 80 దేశాల నుంచి 2,500 ప్రతినిధులు వస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సభల్లో కీలక ఉపన్యాసం చేస్తారని తెలిపారు.
వాషింగ్టన్, సెప్టెంబర్ 4: చికాగోలో ఈ నెల 7 నుంచి 9వరకు జరిగే ప్రపంచ హిందూ సమావేశం (వరల్డ్ హిందూ కాంగ్రెస్)లో చివరి రోజు భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రసంగించనున్నారు. అక్కడ 1893లో జరిగిన పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్ (సర్వమత సమ్మేళనం)లో స్వామి వివేకానందుని చారిత్రాత్మక ప్రసంగానికి సంస్మరణగా 125వ ప్రపంచ హిందూ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
వాషింగ్టన్, సెప్టెంబర్ 4: లఖీద్మార్టిన్స్ ఎఫ్-16 జెట్ యుద్ధ విమానాల రెక్కల తయారీ భారతలో జరుగనుందని అమెరికాకు చెందిన సెక్యూరిటీ, అంతరిక్ష, వైమానిక దిగ్గజ కంపెనీ మంగళవారం నాడిక్కడ ప్రకటించింది. భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా పిలుపునకు స్పందనగా మేరీల్యాండ్లోని లఖీద్మార్టిన్ సంస్థ భారత్లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్తో ఈమేరకు ఒప్పందం కుదుర్చుకుందని ఆ సంస్థ అధికారులు ఇక్కడ తెలిపారు.
నికోసియా, సెప్టెంబర్ 4: తక్షణ ఫలితాలను ఆశించి పనిచేయవద్దని, భవిష్యత్ను దృష్టిలోపెట్టుకుని ముందుకెళ్లాలని రాష్టప్రతి రామ్నాథ్ కోవింద్ యువతకు పిలుపునిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకళింపుచేసుకుని యువత మరింత కష్టపడి పనిచేయాలని మంగళవారం ఇక్కడ స్పష్టం చేశారు. ఐరోపా దేశాల్లో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన రాష్టప్రతి ముందుగా సెప్రస్ వచ్చారు.
నికోసియా, సెప్టెంబర్ 3: డిజిటలైజేషన్, స్మార్ట్ సిటీస్, వౌలిక సదుపాయాలు, పర్యాటకం వంటి రంగాల్లో త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సైప్రస్ వ్యాపారవేత్తలకు రాష్టప్రతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. సైప్రస్ పర్యటనలో భాగంగా రాష్టప్రతి ఇక్కడి పార్లమెంటులో సోమవారం ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ కొత్త అధ్యక్షుడి ఎన్నికల మంగళవారం జరుగనుంది. ప్రస్తుత పాలకవర్గ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అభ్యర్థి ఆరిఫ్ అల్వీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీల తరఫున అధ్యక్ష పదవి కోసం అభ్యర్థులను ఎవరినీ నిలబెట్టకపోవడంతో ఆరిఫ్ అల్వీనే దేశ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు దాదాపు ఖాయమైనట్టే.
వాషింగ్టన్: ఉగ్రవాదాన్ని నిర్వీర్యం చేయడంలో పాకిస్తాన్ కలిసి రానందుకు ట్రంప్ ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. దీంతో పాకిస్తాన్కు 300 మిలియన్ డాలర్ల మేర ఆయుధ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని అమెరికా నిర్ణయించింది. దక్షిణాసియాలో శాంతి స్థాపనకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు పాకిస్తాన్ కలిసి రావడం లేదని పెంటగాన్ వర్గాలు తెలిపాయి.
మనీలా, సెప్టెంబర్ 1: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన తర్వాత వెనక్కు తగ్గడం ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటెర్డ్కు అలవాటుగా మారింది. ఇటీవలే ఒక కార్యక్రమానికి వెళ్లినప్పుడు, అక్కడున్న మహిళను ‘ముద్దు ఇస్తావా’ అని అడిగి సమస్యలను కొని తెచ్చుకున్నాడు. విపక్షమేగాక, స్వపక్షంలోనూ అందరూ ముక్తకంఠంతో చీవాట్లు పెట్టడంతో ‘జోక్ చేశా..