S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/24/2018 - 06:15

జమ్ము, జూన్ 23: జమ్ముకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, దీని విచ్ఛిన్నానికి జరిగే కుట్రలను తిప్పిగొడుతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ కృషి వల్లే భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగమైందని ఆయన అన్నారు. జమ్ముకాశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించడానికి, ఈ ప్రాంతాన్ని దేశం నుంచి వేరు చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

06/23/2018 - 04:19

ఐక్యరాజ్య సమితి, జూన్ 22: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యోగాను అభ్యాసం చేస్తున్నారని, దీనికి మతమంటూ ఏదీ లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. న్యూయార్క్ రాష్ట్రంలోని కాట్‌స్కిల్స్ ప్రాంతంలో ‘యోవన్ లగ్జరీ నేచర్ క్యూర్ సెంటర్’ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ప్రజలను ఏకం చేయగల శక్తి యోగాకు ఉందన్నారు.

06/23/2018 - 05:07

వాషింగ్టన్, జూన్ 22: అమెరికాలో అక్రమంగా ప్రవేశించి అరెస్టయిన వారిని రెండు నిర్బంధ కేంద్రాల్లో ఉంచారని, వీరిలో దాదాపు వంద మందికిపైగా భారతీయులు ఉన్నట్లు అమెరికాలోని ఇండియన్ మిషన్ ప్రకటించింది. వీరిలో చాలామంది పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారున్నారు.

06/22/2018 - 05:16

డెహ్రాడూన్, జూన్ 21: అశాంతితో అల్లాడుతున్న ప్రపంచంలో అందరినీ సంఘటిత పరిచి మానసికపరమైన శాంతిని ప్రసాదించే అద్భుతమైన శక్తి యోగాకు ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గురువారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడి అటవీ పరిశోధన సంస్థ మైదానంలో 50వేల మందితో కలిసి ప్రధాని యోగాసనాలు వేశారు.

06/22/2018 - 02:30

ఐక్యరాజ్యసమితి, జూన్ 21: నైతిక విలువలు మృగ్యమై, వాణిజ్య దృక్పథంతో జీవిస్తున్న మానవాళి మానసిక వత్తిళ్ల నుంచి దూరమయ్యేందుకు యోగా మంచి పరిష్కారమని ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మహమ్మద్ అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రాచీన భారతం ప్రపంచానికి అందించిన గొప్ప సాధనం యోగా అని ప్రశంసించారు.

06/22/2018 - 02:29

మొరేనా (మధ్యప్రదేశ్), జూన్ 21: మధ్యప్రదేశ్‌లో మొరేనా జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందారు. మరణించాన తమ బంధువు సంతాప కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న జీపును ట్రాక్టర్ ట్రాలీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

06/21/2018 - 04:53

జమ్మూ, జూన్ 20: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ ఔరంగజేబు కుటుంబాన్ని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం పరామర్శించారు. ఈద్‌కు రెండు రోజుల ముందు జవాన్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, హత్య చేశారు. ఆర్మీ ఉన్నతాధికారులతో కలిసి రక్షణ మంత్రి బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు.

06/21/2018 - 02:44

ఐక్యరాజ్య సమితి, జూన్ 20: సరిహద్దు ప్రాంతాల్లో చిన్నతరహా ఆయుధాల అక్రమ వ్యాపారం ప్రధాన సమస్యగా మారిందని, దీనిని అడ్డుకుంటామని చిన్న ఆయుధాల సరఫరాపై ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సదస్సులో భారత రాయబారి, నిరాయుధీకరణ సదస్సులో శాశ్వత సభ్యుడు అమన్‌దీప్ సింగ్ గిల్ స్పష్టం చేశారు.

06/21/2018 - 02:42

వాషింగ్టన్, జూన్ 20: ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని మానవ హక్కుల సమితి నుంచి అమెరికా వైదొలగింది. ఏకపక్ష విధానాలను అనుసరిస్తూ, అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తింది. సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హాలే ఒక ప్రకటనలో మానవ హక్కుల సమితి విధానాలను ఎండగట్టారు. ఊహాజనితమైన అంశాలపై ప్రసంగాలను వినదలచుకోలేదని వ్యాఖ్యానించారు.

06/20/2018 - 05:22

బీజింగ్, జూన్ 19: చైనా పర్యటన నిమిత్తం ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మంగళవారం బీజింగ్‌కు చేరుకున్నారు. ఆయన ఇక్కడ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చలు జరపనున్నారు. ఈ నెల 12వ తేదీన సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌తో కిమ్ చర్చలు జరిపిన విషయం విదితమే. ఈ చర్చల విశేషాలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వివరించేందుకు కిమ్ వచ్చారు. ఈ ఏడాది బీజింగ్‌కు కిమ్ రావడం ఇది మూడోసారి.

Pages