S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విశాఖపట్నం, ఆగస్టు 5: రోడ్డు భద్రతపై జాతీయ స్థాయి వర్క్షాప్ ఈ నెల 19, 20 తేదీల్లో నగరంలోని నిర్వహించనున్నారు. రాష్ట్ర రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వర్క్షాప్కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర ఉపరితలశాఖామంత్రి నితిన్ గడ్కారీ, రాష్ట్రాల రవాణామంత్రులు, కమిషనర్లు తదితర అధికారులంతా హాజరుకానున్నారు.
విశాఖపట్నం, ఆగస్టు 5: నగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలెప్మెంట్ అథారిటీ (ఎంపీఈడీఏ), భారత సీఫుడ్ ఎక్స్పోర్టర్స్ అసోసియే షన్ (ఎస్ఈఏఐ), భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలో 20వ ఇండియా ఇంటర్నేషనల్ సీఫుడ్ షోను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని (మిగతా 2వ పేజీలో)
విశాఖపట్నం, ఆగస్టు 5: ‘కష్టపడండి.. మృదువుగా సంభాషించండి.. అదే జీవితాన్ని మారుస్తుంది.. విజయానికి రహస్యం అదే’ అంటూ విద్యార్థులకు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఉపదేశించారు. ఎయు ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కటవుగా మాట్లాడం మాని మృదువుగా, ప్లీజింగ్గా మాట్లాడం నేర్చుకోవాలని, అలా ఉండటం అలవాటు చేసుకుని వచ్చే ఫలితాలను గమనించాలని కోరారు.
విశాఖపట్నం, ఆగస్టు 5: ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలువునా ముంచేసారని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. జగదాంబ జంక్షన్ సమీపానున్న పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఢిల్లీయాత్రలో ప్రత్యేక హోదా అడగలేదని విమర్శించారు. ఏపీని ముంచుతూ వారిని కూడా ముంచే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
జగదాంబ, ఆగస్టు 5: బాలల హక్కుల పరిరక్షణలో, బాలల హక్కుల కోసం నిర్విరామ పోరాటం చేస్తున్న సంఘాలు రాజీపడకుండా ప్రభుత్వాలకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, భారత ప్రభుత్వ, జాతీయ బాలల హక్కుల కమీషన్ సభ్యురాలు రూపాకపూర్ అన్నారు.
నర్సీపట్నం, ఆగస్టు 5: సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. శుక్రవా రం విశాఖపట్నంలో జరిగిన నర్సీప ట్నం నియోజకవర్గం సమన్వయ కమి టీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అనకాపల్లి, ఆగస్టు 5: శాసనసభకు మరో రెండున్నరేళ్ల తరువాత ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పటినుండే తమ స్థానాలను పదిలం చేసుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపా నేతలు తమదైన పంథాలో ముం దస్తు కసరత్తుకు శ్రీకారం చుడుతున్నారు. ప్రధానంగా అనకాపల్లి అసెంబ్లీ నుండి వచ్చే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది.
పాడేరు, ఆగస్టు 5: పాడేరు మండలం వంతాడపల్లి పంచాయతీ నరింగిబడి, మినుములూరు పంచాయతీ సల్దిగెడ్డ గ్రామాలలో అతిసార వ్యాధి విజృంభించింది. గత పది రోజులుగా ఈ గ్రామాలలో అతిసార వ్యాధి విలయతాండం చేస్తుండడంతో ఇంతవరకు నలుగురు గిరిజనులు మత్యువాత పడగా పాడేరు ఏరియా ఆసుపత్రిలో పది మంది గిరిజనులు చికిత్స పొందుతున్నారు.
అనకాపల్లి(నెహ్రూచౌక్), ఆగస్టు 5: పంచాయతీ రాజ్ శాఖామంత్రి అయ్య న్న సహకారంతో అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తూ ఎన్ఆర్జిఎస్ నిధులు పుష్కలంగా మంజూరు చేస్తున్నారని వాటితో అన్ని గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కోరా రు. స్థానిక మండల పరిషత్ సమావేశం హాలులో శుక్రవారం నియోజకవర్గం స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.
తిరుపతి, ఆగస్టు 5: ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర అసెంబ్లీ ప్రభుత్వ రంగ సంస్థ చైర్మన్ కాగితపు వెంకటరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకొని శుక్రవారం స్థానిక పద్మావతి అతిథి గృహంలో టూరిజం అధికారులతో ఎపిఎం డిసి అధికారులతో ఆ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.