మెదక్

ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిన్నారం, సెప్టెంబర్ 25: ప్రమాద వశాత్తూ ఆర్టీసీ బస్సు ఢీ కొని మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని బొల్లారం మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. జీడిమెట్ల డిపోకు చెందిన బస్సు రాత్రి సమయంలో బొల్లారంకు చేరుకుంది. కాగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతోఈ ఘటన చోటుచేసుకుంది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ప్రమోదిని (56) అనే మహిళ తన కూతురు ఉషశ్రీ ఇంట్లో నివాసం వుంటూ స్ధానిక పరిశ్రమలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా సోమవారం రాత్రి విధులు ముగించుకొని 9గంటల ప్రాంతంలో తిరిగివస్తూ వుండగా మున్సిపల్ కార్యాలయం వద్ద వెనుకనుండి జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కోట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ బి.ఎస్ కుమార్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. మృతదేహాన్ని పొస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఆసుపత్రికి తరలించినట్లు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జయశంకర్ తెలిపారు.