కర్నూల్

మద్దులేటయ్య హుండీ ఆదాయం రూ. 55.74 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేతంచెర్ల, ఏప్రిల్ 29:మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీమద్దులేటి నరసింహస్వామి ఆలయానికి హుండీల ద్వారా రూ. 55,73,995 ఆదాయం చేకూరినట్లు ఇఓ తిమ్మనాయుడు, చైర్మన్ యల్లనాగయ్య తెలిపారు. ఆలయంలో స్వామి, అమ్మవార్లకు భక్తులు జనవరి నుంచి ఇప్పటివరకూ హుండీల ద్వారా సమర్పించిన ముడుపులను శుక్రవారం పర్యవేక్షణ అధికారిణి సరస్వతి, భక్తులు, బ్యాంకు అధికారులు, ఆలయ కమిటీ చైర్మన్, సభ్యుల సమక్షంలో ఆలయ ఆవరణలో లెక్కించినట్లు ఇఓ తెలిపారు. తద్వారా ఆలయానికి రూ. 55,73, 995 నగదు, 125 గ్రాముల బంగారం, 5.7 కిలోల వెండి వచ్చినట్లు ఇఓ తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో కమిటీ సభ్యులు మునీశ్వరరెడ్డి, రాధాకృష్ణ, సూర్యచంద్రారెడ్డి, వరలక్ష్మి, బేతంచెర్ల ఆంధ్ర బ్యాంకు మేనేజర్ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.