కర్నూల్

సజావుగా ఎంసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు అర్బన్, ఏప్రిల్ 29:ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్‌లో ప్రవేశం కోసం నిర్వహించిన ఎంసెట్-2016 పరీక్ష శుక్రవారం జిల్లా కేంద్రంలో సజావుగా జరిగింది. ఉదయం 16 కేంద్రాల్లో జరిగిన ఇంజినీరింగ్ పరీక్షలో 7,656 మందికి గానూ 7,312 మంది హాజరు కాగా 344 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యా హ్నం 15 కేంద్రాల్లో జరిగిన మెడిసిన్ పరీక్షకు 7,377మందికి గానూ 7015 మంది హాజరు కాగా 362 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రాష్ట్ర పరిశీలకులుగా ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన వీరసోమయ్య నగరంలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని రీజినల్ కో-ఆర్డినేటర్ బి.శ్రీనివాసురెడ్డి తెలిపారు.