కర్నూల్

ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్భ్రావృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఏప్రిల్ 30:ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం శ్రమిస్తూ ఉద్యమస్ఫూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీ సిఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్సీ శిల్పా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ వైకాపా చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. సిఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని వివరించారు. 7వ తేదీ సిఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించి జిల్లాలో జరగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించనున్నట్లు తెలిపారు. అలాగే గతంలో తంగడంచె ప్రాంతంలో జైన్ కంపెనీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, గుజరాత్‌కు చెందిన అంబుజా సిమెంట్ కంపెనీలకు స్థలాలు కేటాయించి భూమిపూజ చేశారని, 7వ తేదీ ఆ పనులను ప్రారంభిస్తారన్నారు. వాటితో పాటు ఆలూరు నియోజకవర్గంలో పర్యటించి ఇంకుడుగుంతలు, పంట సంజీవని కింద చేపడుతున్న ఫారం పాండ్స్‌ను ప్రారంభిస్తారన్నారు. సమావేశంలో శిల్పాతో పాటు పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కెడిసిసి బ్యాంక్ చైర్మన్ ఎం.మల్లికార్జునరెడ్డి, నాయకులు మల్లెల పుల్లారెడ్డి, అల్లాబకాష్, బాబురాజ్, నాగేంద్ర, మహేష్‌గౌడ్, హనుమంతరాయచౌదరి పాల్గొన్నారు.