కర్నూల్

ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవెలకుంట్ల, మే 17:మండల పరిధిలోని జోలదరాశి గ్రామం వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలానికి చెందిన శంకరమూర్తి(34), జగదీష్ కోవెలకుంట్లలో పొలం కొనుగోలు చేసి కొంతకాలంగా ఇక్కడే ఉంటూ పొలం పనులు చూసుకునేవారు. కాగా మంగళవారం గోస్పాడు మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో బంధువుల ఇంటిలోని ఒక వేడుకకు హాజరై తిరిగి కారులో కోవెలకుంట్లకు బయల్దేరారు. అయితే జోలదరాశి గ్రామం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కోవెలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీబస్సు ఢీకొనడంతో కారు నడుపుతున్న శంకరమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. జగదీష్ తీవ్రంగా గాయపడడంతో నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీధర్ తెలిపారు.