కర్నూల్

జగన్ దీక్షతో సీమకే నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాగలమర్రి, మే 17: మన రాష్ట్రానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణకు వ్యతిరేకంగా వైకాపా అధ్యక్షులు జగన్ కర్నూలులో చేపట్టిన జలదీక్షతో రాయలసీమకే నష్టం జరుగుతుందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన చాగలమర్రిలో విలేఖర్లతో మాట్లాడుతూ గుండ్రేవుల, ఆర్డీ ఎస్, సిద్ధేశ్వరం, శ్రీశైలం తదితర ప్రాజెక్టులు తెలంగాణతో ముడిపడి ఉన్నాయన్నారు. రాయలసీమ రైతులపై జగన్‌కు ఏమాత్రం ప్రేమ ఉన్న కెసిఆర్‌తో చర్చించి సామరస్యంగా సమస్యను పరిష్కరించాల్సి ఉందన్నారు. కెసిఆర్ హిట్లర్ అని విమర్శిస్తే రెండు రాష్ట్రాల మధ్య విబేదాలు ఏర్పడుతాయన్నారు. జగన్ పార్టీ తెలంగాణలో కనుమరుగు కావడంతో సీమలోనైనా తన ఉనికి చాటుకొనుటకు జలదీక్ష పేరుతో జగన్ ఈ కార్యక్రమం చేపట్టినట్లు బైరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు మల్లేశ్వరరెడ్డి, విద్యావంతుల సంఘం కన్వీనర్ ప్రతాపరెడ్డి తదితరులు ఉన్నారు.