కర్నూల్

సమస్యాత్మక గ్రామాలపై నిఘా పెంచాలి:ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, మే 17:్ఫ్యక్షన్, సమస్యాత్మక గ్రామాలపై నిఘా మరింత పెంచాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ మంగళవారం ఉదయం స్థానిక స్టేషన్‌కు రాగా ఆ సమయంలో ఎస్‌ఐ సి.నరేంద్రకుమార్‌రెడ్డి, ట్రైనీ ఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బంది హాజరు, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. అనంతరం స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల గురించి ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు. అలాగే సిబ్బందితో వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో, బయట ఏవైనా సమస్యలు వుంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా రామకృష్ణాపురం గ్రామంలో ఇరువర్గాల హత్యోదంతాల నేపథ్యంలో అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు. గ్రామాలపై పోలీసులకు బాధ్యతలు కల్పించడమే కాకుండా గ్రామాలనూ తరచూ సందర్శిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించాలని, చట్ట వ్యతిరేక పనులను నిరోధించాలని సూచించారు. అనంతరం నందివర్గం ఎస్‌ఐ, పోలీసుల పనితీరును ఎస్పీ అభినందించారు.