కర్నూల్

దొంగల పార్టీలకు బుద్ధి చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, నవంబర్ 17: రాష్ట్భ్రావృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న దొంగల పార్టీ వైసీపీకి బుద్ధిచెప్పాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోని షాదీఖానాలో శనివారం పార్టీ పట్టణ అధ్యక్షులు కోట్రికె ఫణిరాజ్ అధ్యక్షతన జరిగిన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో గాలివాటంతో గెలిచిన బుగ్గన డోన్ ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. డోన్‌లో అభివృద్ధి పనులు చేస్తుంటే అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు అధికారులను బెదిరించడం మంచిది కాదని హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడిందని, ఆ కూటమిలో టీడీపీ భాగస్వామ్యం మాత్రమేనని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదన్నారు. డోన్ కెఈ కుటుంబానికి కంచుకోట అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో డోన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా కెఈ ప్రతాప్ పోటీ చేస్తారన్నారు. కెఈ కుటుంబానికి కాదని ఎవ్వరికీ టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదన్నారు.

డోన్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: కెఈ ప్రతాప్
రాబోయే ఎన్నికల్లో డోన్ నుంచే పోటీ చేసి తీరుతానని, డోన్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని టీడీపీ ఇంచార్జి కెఈ ప్రతాప్ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి సహకారంతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. డోన్‌కు శాశ్వత నీటిప్రాజెక్టు, బేతంచెర్లకు డబుల్ రోడ్డు, సాయిబాబా దేవాలయ నిర్మాణం, చెరువులకు హంద్రీనీవా నీరు, పల్లెపల్లెకు తారురోడ్డు, కొత్తపల్లెకు తాగునీరు, సీసీరోడ్డు వేయిస్తున్నామన్నారు. ఓ సామాజికవర్గం తనపై దుష్ప్రచారం చేస్తోందని, వాటిని నమ్మవద్దన్నారు.

టీడీపీలో చేరిన ప్రజావైద్యశాల మల్లికార్జున..
కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజావైద్యశాల మల్లికార్జున జిల్లా టీడీపీ నేతల సమక్షంలో పార్టీలో చేరారు. మల్లితో పాటు ఆయన అనుచర వర్గమంతా టీడీపీ తీర్థం పుచ్చుకుంది.