కర్నూల్

ఎర్రచందనం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాగలమర్రి, ఏప్రిల్ 17: మండలంలోని చిన్నవంగలి గ్రామం వద్ద గల రేకుల వంతెన వద్ద ఆదివారం అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి రూ.3 లక్షలు విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. రుద్రవరం రేంజ్ అధికారి రాంసింగ్ ఆధ్వర్యంలో దాడులు జరిపి, 13 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నామన్నారు. స్మగ్లర్లు పరారయ్యారన్నారు. అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో అటవీ శాఖ సిబ్బంది, ప్రొటక్షన్ వాచర్లు పాల్గొన్నారన్నారు.