కర్నూల్
ఏం తప్పు చేశానని వేటు చేశారు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కర్నూలు ఓల్డ్సిటి, సెప్టెంబరు 19:కాంగ్రెస్ పార్టీకి గత 40 ఏళ్లుగా సేవ చేస్తే బహుమానంగా సస్పెన్షన్ వేటు వేశారని ఎమ్మెల్సీ సుధాకర్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం నగరంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తాను ఏం తప్పు చేశాను, పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ వ్యవహరించానో పార్టీ పెద్దలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి అధికారం, పదవులు లేకపోయినా అంకితభావంతో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశానని వెల్లడించారు. అయితే పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన మాట్లాడుతూ తాను ఎక్కడా అలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. తాను పని చేసిన పార్టీ తనను సస్పెండ్ చేసినట్లు ప్రకటించడంతో మానసిక వేదనతో పార్టీని ప్రశ్నిస్తున్నానని తెలిపారు. దళితులకు పదవులు వస్తే కొందరు సహించలేకపోయారని మండిపడ్డారు. దళితులను వ్యతిరేకించిన వారు ముందుకెలా వెళ్తారో తానూ చూస్తానని హెచ్చరించారు.