మెదక్

జిల్లా కేంద్రంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 14: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను గురువారం జిల్లాకేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు.
బిజెపి ఆధ్వర్యంలో
బాబా సాహేబ్ జయంతి సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు కాసాల బుచ్చిరెడ్డి పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలులు వేసి నివాళులు అర్పించారు. దళిత, బడుగు, బలహీన వర్గాల కోసం అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహారెడ్డి, జగన్, విష్ణువర్ధన్, మందుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు అనిల్‌రెడ్డి, అశోక్, చారి, దత్తు, సాయికిరణ్, శివ తదితరులు పాల్గొన్నారు.
టిడిపి ఆధ్వర్యంలో
భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా అధ్యక్షురాలు జి.శశికళ యాదవరెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీశేణ్రులతో కలిసి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి శంఖుస్థాపన చేయడాన్ని స్వాగతిస్తున్నాము కానీ ఇప్పటి వరకు దళితులకు, మహిళలకు మంత్రి వర్గంలో చోటు కల్పించకపోవడంలో ఆంతార్యమేమిటని ప్రశ్నించారు. రాజ్యాంగ పరంగా తెరాస ప్రభుత్వం నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు ప్రభు, సత్యనారాయణ, నర్సింలు, బందేన్నగౌడ్, అయ్యప్పస్వామి, బుచ్చిరెడ్డి, బాల్‌రెడ్డి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం ఆధ్వర్యంలో
సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు రాజయ్య, మానిక్యం, అడివయ్య, సాయిలు, యాదవరెడ్డి, ప్రవీన్‌కుమార్, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి
తెలంగాణ జాగృతం జిల్లా కన్వీనర్ ఉదయ్ భాస్కర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మోహన్‌రెడ్డి, వేణుగోపాల్, జిల్లా కన్వీనర్ శివశంకర్‌పాటిల్, ప్రవీన్, కృష్ణ, నర్సింహామూర్తి తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో
అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అస్తబల్‌లోని నిర్వహించిన కార్యక్రమానికి బిసి కార్పోరేషన్ ఈడి రాంరెడ్డి హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీని జెండాఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభాకర్, మోహన్, బాల్‌రాజ్, శ్రీనివాస్, వినోద్, సుమంత్, భరత్, రాజు తదితరులు పాల్గొన్నారు.
యుటిఎఫ్ ఆధ్వర్యంలో
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌రావు, వెంకయ్య, బాలకృష్ణ, రవి, రమేష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.