మెదక్

విజయమే లక్ష్యంగా శ్రమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, సెప్టెంబర్ 21: ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమించాలని, అయితే గజ్వేల్ నుండి కేసీఆర్ తిరిగి పోటీ చేస్తున్నందున లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మెన్ పన్యాల భూపతిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వర్గల్ మండలం మైలారంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌కు కార్యకర్తలే పట్టు కొమ్మలు కాగా, వారి శ్రమను పార్టీ తప్పకుండా గుర్తించి సరైన ప్రోత్సాహం కల్పిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా అభివృద్దిని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు కుట్రలకు తెరలేపగా, చివరకు ఎన్నికలు సైతం అడ్డుకునేందుకు కోర్టు పక్షులుగా మారినట్లు ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రజలు అండగా నిలుస్తుండగా, మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, డబల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం, కేజీటూపీజీ విద్య తదితర పథకాల అమలుతో దేశం తెలంగాణవైపు చూస్తోందని తెలిపారు. అభివృద్ది, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేసిన టీఆర్‌ఎస్ సర్కార్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, ప్రతిపక్షాలు అపవిత్ర పొత్తులతో మహా కూటమిగా ఏర్పడినా వారికి ఓటమి తప్పదని ఎద్దేవా చేశారు.