మెదక్

చట్టపరమైన విషయాల్లో న్యాయం జరిగేలా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, డిసెంబర్ 17: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ చందనాదీప్తి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణిలో భాగంగా ఫిర్యాదుదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులకు చట్టపరమైన విషయంలో న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన దోసల వెంకటయ్య తనను తన కొడుకు కార్తీక్ గత కొద్దికాలంగా తనపై అనేకసార్లు దాడిచేశాడని, కిరోసిన్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నించాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరొకసారి తాను మా ఇంట్లో పడుకొని ఉండగా తనను గొడ్డలితో నరకడానికి వచ్చాడని, అనేకసార్లు తనపై కర్రతో దాడి చేసి గాయపరిచాడని, తన కొడుకు దాడి చేస్తుండగా భయపడి కోనాపూర్‌లోని తన అక్క ఇంట్లో తలదాచుకుంటున్నానని, ఈ విషయం తెలుసుకొని తన కొడుకు అక్కడికి వచ్చి విపరీతంగా కొట్టాడని, తన కొడుకు వల్ల తనకు ప్రాణభయం ఉందని, తనకు తగిన న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ చట్టప్రకారం ఫిర్యాదుదారునికి న్యాయం చేయాలని రామాయంపేట సీఐని ఆదేశించారు. నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి అనితను తన పాలివారు కె.చిత్తారి, నగేష్, మల్లమ్మ, మంజుల అకారణంగా కొట్టి బూతులు తిట్టారని, ఎందుకు కొడుతున్నారని అడుగగా తన భర్త యాదగిరి తనను గతంలో తిట్టాడని, బూతులు తిడుతూ పైన తెలిపిన వారు కొట్టారని తనకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేయగా స్పందించిన చందనాదీప్తి చట్టప్రకారం విచారణ జరిపి ఫిర్యాదికి న్యాయం చేయాలని తూప్రాన్ డీఎస్పీని ఆదేశించారు. తూప్రాన్ గ్రామానికి చెందిన కిచ్చిగారి హంసను తన పిన తండ్రి సర్గల్ పోచయ్య తనకు పిల్లలు లేకపోవడంతో తనకు దత్తత తీసుకున్నాడని, అయితే అక్టోబర్ 27న తన పినతండ్రి మరణించాడని, ఆయన మరణం తరువాత మా కుటుంభానికి చెందిన సర్గల్ స్వామి, దేవయ్య, మంగమ్మ, ఎల్లమ్మ, విజయ్, తిమ్మాయిపల్లి భాగ్యమ్మ, భాస్కర్‌లు కలిసి మా పినతండ్రి ఆస్తిపాస్తులను అక్రమంగా స్వాదీనం చేసుకొని తనను ఇంట్లో నుండి వెళ్లగొట్టారని తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ స్పందిస్తూ ఫిర్యాదు ప్రకారం విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని తూప్రాన్ ఎస్‌హెచ్‌ఓను ఆదేశించారు. ఈ విధంగా వచ్చిన అనేక ఫిర్యాదులను పరిశీలించి ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తానని ఎస్పీ చందనాదీప్తి భరోసా ఇచ్చారు.
విద్యార్థినులపై..
ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు

* చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి ఫిర్యాదు
సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 17: విద్యార్థినీలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైగింక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ చిప్పె సంగమేశ్వర్ సోమవారం జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి ఫిర్యాదు చేసారు. కీచక ఉపాధ్యాయునిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామ జెడ్పీహెచ్‌ఎస్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు పాత్త్యా కిషన్ పదవ తరగతి విద్యార్థినీలను గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల మొదటి అంతస్తులో ఉన్న ల్యాబ్‌లోకి తీసుకెళ్లి తన ఫోన్‌లోని అసభ్య చిత్రాలను చూపిస్తూ వెలికి చేష్టలు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర స్ట్ఫాకు గాని, విద్యార్థినీల తల్లిదండ్రులకు గాని చెప్పితే 10వ తరగతిలో ఫెయిల్ చేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భయపడి సంఘటనను విద్యార్థులు బయటకు చెప్పలేకపోయారని, ఈ నెల 15న కొంటి సాకులతో ల్యాబ్‌కు తీసుకెళ్లిన ఉపాధ్యాయుడి వైధింపులను భరించలేక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. సంఘటనను దృష్టిలో ఉంచుకొని పిల్లల భవిష్యత్‌పై అసభ్య ప్రభావం పడకుండ చూడాలని, ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని చైర్మన్‌తో పాటు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.