మెదక్

సాక్షర భారత్ కేంద్రంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లాదుర్గం, మే 27: అల్లాదుర్గం మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో సాక్షర భారత్ కేంద్రం కొనసాగడం లేదని ఆ గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటు చేసినప్పటి నుండి ఎప్పుడు కూడా ఏ నలుగురికి విద్య నేర్పడం లేదని, సాక్షర భారత్ కేంద్రం పేరుతో నెలనెల వేతనాలు పొందుతున్నారే తప్పా ఈ కేంద్రంలో నిరక్షరాస్యులకు బోధన చేయడం పలువురు ఆరోపించారు. కేంద్రం సక్రమంగా కొనసాగించాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. సాక్షర భారత్ కేంద్రాలు గ్రామాల్లో నడుస్తున్నా లేవా అని పరిశీలించాల్సిన మండల కో ఆర్డినేటర్లు సైతం పర్యవేక్షణ జరపకపోవడంతో ఈ కేంద్రాలు ఎప్పుడు తెరచిన దాఖలాలు లేవన్నారు. ఈ కేంద్రం సక్రమంగా కొనసాగితే కొందరికైనా విద్యానందించవచ్చని వారు అభిప్రాయపడ్డారు.