మెదక్

కళ్లకు గంతలో 2వ ఎఎన్‌ఎంల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 22 : ఎఎన్‌ఎంల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తు కళ్లకు గంతలతో శుక్రవారం నిరనస వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా సిఐటియు డివిజన్ ఉపాధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ ఎఎన్‌ఎంల సమస్యల పరిష్కరించాలని గత ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. ఎఎన్‌ఎంలకు 10వ పిఆర్‌సి ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎఎన్‌ఎంలకు పిఎఫ్, ఇఎస్‌ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించేవరకు ఆందోళన ఉద్దృతం చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో మంజుల, లావణ్య, స్వర్ణలత, రజిత, మమత, నాగరాణి, సంతోషి, రేణుక తదితరులు పాల్గొన్నారు