మెదక్

నంగునూరును హుస్నాబాద్‌లో కలపొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 22: నంగునూరు మండలాన్ని జిల్లా పునర్విభజనలో హుస్నాబాద్ డివిజన్‌లో కలుపవద్దని అఖిల పక్షం నేతలు సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంగునూరు మండలానికి సిద్దిపేటతో ఎన్నో ఏండ్లుగా అనుబంధం ఉందని, విద్యా, వ్యాపార, వైధ్య తదితర విషయాల్లో మండల వాసులు సిద్దిపేటపైనే ఆధారపడ్డారని తెలిపారు. కెసిఆర్, హరీశ్‌రావులు తమ ఇష్టానుసారం గా నంగునూరును విభజించాలని చూడటం సరికాదన్నారు. కెసిఆర్‌ను ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేయడంలో నంగునూరు పాత్ర ఎంతో ఉం దని, అలాగే హరీష్‌కు సైతం మండలం ప్రజలు అదే రీతిలో మద్దతుగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్షం నేతలు దేవుల పల్లి యాదగిరి, చెలికాని మల్లేశం, ఎండి ఇమ్రాన్, నాగరాజు, హేమలత, కృష్ణ, తిరుపతిరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.