తోవ్వ ముచ్చట్లు - జయదిర్

ఆయన పేరు బి.స. సత్యానందం. కలం పేరు నిజం. వాగరి అనే పేరుతో 34తెలుగా, ఆంధ్ర మా?22 పుస్తకం రాశారు. సత్యానందం అనేది సంస్కృతం పేరు. అది తల్లిదండ్రులుంచిన పేరు. అందుకే తెలుగులో బి.స.బంగారయ్య అని మార్చుకున్నాడు. ఆ పేరుతోనే నుడి-నానుడి ,నలుపు చేసిన నేరము ఏమి22అనే పుస్తకాలు రాశాడు. 3డష్దళజూఖళజూ ళ్ఘఒఆళఒ: డళ్ఘూష్ద యూ శ నిశజూళశఆజఆక’’2పుస్తకాన్ని ఆంగ్లంలో రాశాడు. నిజం2కలం పేరుతో గోరాశాస్ర్తీ సంపాదకులుగా ఉన్న తెలుగు స్వతంత్ర2పత్రికలో ఎన్నో ఆలోచనాత్మక వ్యాసాలు రాశారు.
అలాంటి బంగారయ్య నిజానికి దళితుడు. క్రైస్తవ మతస్తులు. తెలుగు తమిళనాడు సరిహద్దులో ఉత్తర ఆర్కాటు ప్రాంతంలో అటునిటు పుట్టాడు. ఆ తదుపరి నెల్లూరులో స్థిరపడ్డాడు. ఆయన ఎవరన్నది ముఖ్యంకాదు. అతనొక జ్ఞాని. తమిళం అంటే ప్రేమ. తెలుగంటే ప్రాణం. తెలుగు లోనే ఆలోచించాలని కలలుగన్నాడు. సంస్కృతం సాధారణ తెలుగు విద్యార్థులకు ప్రతిబంధకంగా ఉండకూడదని ఆయన ఆలోచన.
బి.ఏ. పూర్తిచేసి జిల్లా సుపర్నెంటు కార్యాలయంలో పనిచేశాడు. బి.టి. శిక్షణ పొంది తిరుత్తనిలో బి.ఎ, బి.టిగా పనిచేశారు. తరువాత కొన్నాళ్ళు కృష్ణా జిల్లా, జిల్లా పరిషత్తులో సోషల్ స్టడీస్ పంతులుగా పనిచేశాడు. ఆ తరువాత రాజినామా చేసి నిరుద్యోగం చేశాడు. జీవిక కోసం ఓప్రైవేటు సంస్థలో పనిచేశాడు. ఆ ఉద్యోగం మానేసి విజయవాడ పూర్ణానందంపేటలో ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో సబ్ ఎడిటర్గా పనిచేశాడు. ఆ తరువాత నెల్లూరు వెళ్ళిపోయారు. చాలాకాలం పెళ్ళి చేసుకోలేదు.
బంగారయ్యది స్వతంత్ర ప్రవృత్తి. దేనికీ లొంగడు. మంచి చదువరి. ఆంగ్లంలో, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలడు. గ్రంథ రచన చేయగలడు. తమిళం, హిందీ, తెలుగు భాషల్లో నిష్ణాతుడు.
స్వతంత్రేచ్ఛవల్ల, బంధాలు పెంచుకోవద్దని ఆయన చాలాకాలం పెళ్ళిచేసుకోలేదు. ఆ తదుపరి పెళ్ళిచేసుకుని పిల్లల్ని కన్నాడు. అయనా సంసారం జీవితంలో ఒదిగిపోలేదు. ఒక యోగిలా జీవించాడు. ఎలాంటి సంకెళ్ళలో దూరలేదు.
తిరువూరులో పంతులుగా పనిచేస్తున్నప్పుడు య.మాధవరావు, భాస్కర్, కె.కోటేశ్వరరావు వంటి మిత్రులతో కలిసి 3తెలుగు నానుడి కూటమి2 ఏర్పాటుచేశారు. దాని ద్వారానే తెలుగా, ఆంధ్రమా? వంటి ఐదు గ్రంథాలు ప్రచురించారు. అరవైయవ దశకంలో తెలుగులో నిశ్శబ్దం ఎక్కువ. వామపక్షాలకు సరైన దిశానిర్దేశం లేని కాలం. వారు చీలికల వైపు ఆలోచిస్తున్న వేళ. స్వతంత్ర ఉద్యమాలు సైతం చచ్చుపడిపోతున్న సమయం. గిడుగు తరువాత భాషపై స్వతంత్ర ఆలోచనలు సన్నగిల్లాయి. విశ్వవిద్యాలయాల అకడమిక్ చట్రంలో, పరిశోధన పద్ధతిలో కొత్త ఆలోచనలు లేకుండా పోయాయి. సమాజంలో చలనం మందగించిన రోజుల్లో బంగారయ్య ఆలోచనలు తీవ్రంగా సాగాయి. అతని నిర్దుష్ట, సహేతుక, స్వతంత్ర ఆలోచనలు తెలుగు భాష, జాతి, సాహిత్యాలను వడగాచి కొత్తదిగా కొత్త రూపంలో వెలువడ్డాయి. ఐతే గిడుగువారి వ్యవహారికాంధ్రంకన్నా భిన్నంగా అతను రాత2్భషను సైతం మార్చాడు. భాషా మూలాలలోంచి చేసిన అతని కొత్త ప్రతిపాదనలు చెంపచెళ్ళుమనిపించేలా ఉన్నాయి. అంతటి తీవ్రభావాలే కాదు. వాటిని వ్యక్తంచేయడానికి సంస్కృత పదాలను, సమాసాలను, సంధి రూపాలను విడనాడి తెలుగు పదాలను, విడివిడి పదాలుగా విరిచి వాటిస్థానే వాడాడు. ఈ భాష, అతని వౌలిక భావనాలను తెలుగు సమాజం పక్కన పడేసింది. లెక్కలోకే తీసుకోలేదు. అతని గ్రంథాలు చాలావరకు అజ్ఞాతంగానే ఉండిపోయాయి. తెలుగువారూ చదవలేదు. ఆంధ్రులూ చదవలేదు. తెలుగు సాహిత్య పరిశోధకులు ఆధార గ్రంథంగా ఎక్కడా పేర్కొనలేదు. భాషా శాస్తజ్ఞ్రులకు అలాంటి పుస్తకం ఒకటుందని తెలియదు. తెలుగుభాషపై పరిశోధకులు చేసే పరిశోధకులు కనీసం ఒక తెలుగు పుస్తకాన్ని రెఫరెన్స్ పుస్తకంగా ఇవ్వడానికి సైతం వీరి గ్రంథాలు నోచుకోలేదు. అంత అస్పృశ్యతకి గురైన గ్రంథాలు ఇటీవలి కాలంలో అంతగా లేవు.
అది 1979. ఓ ఆదివారం ఉదయం. హైదరాబాదు ఆబిడ్సులో పాత పుస్తకాల దుకాణం దగ్గర తెలుగా ఆంధ్రమా? పుస్తకం చూశాను. చిన్నగా ఉంది. పేజీలు ఊడి ఉన్నాయి. దాని రేటు తక్కువగా ఉంది. పేజీలు తిరగేశా. అచ్చుతప్పులు కనిపించాయి. కాని రాసిన విషయం మాత్రం షాక్కొట్టింది. ప్రతి పేజీ ఒక షాక్. బంగారయ్య అనే వాడికి తెలుగు భాష రాయడం రాదేమో అని మొదట అనుకున్నాను. తప్పులతో కూడిన పుస్తకం కాబట్టి కొనవద్దనుకొన్నాను. పక్కనే అరుగుమీద కూర్చుని చదివానో లేదా తిరగేశానో జ్ఞాపకం లేదు. కాని అమోఘమైన విషయాలు అందులో ఉన్నాయి. విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో పఠించడానికి నిషిద్ధమైన వాక్యాలు. ధర అడిగా. మూడింతలు ఎక్కువ చెప్పాడు. ఆనాడు పాత పుస్తకం అంటే ఉన్న ధరకన్నా సగం తక్కువకి ఇవ్వాలి. అతను అలానే అమ్ముతాడు. మళ్ళీ అడిగా తప్పు చెప్పాడేమో అని. తక్కువకి ఇస్తాడేమోనని. కాని ససేమిరా అన్నాడు. 3రేర్ బుక్ హైసాబ్!22 అన్నాడు. వద్దులే అని వెళ్ళిపోయా. కాని మనసు ఈవేపే లాగుతోంది. ఓ గంటాగి మళ్ళీ తిరిగి వచ్చాను. పుస్తకం చేతపట్టుకుని 34సరే! ఇవ్వుమని22 జేబులోంచి డబ్బులు తీస్తున్నాను. పంచె కట్టుకున్న ఓ పెద్దమనిషి తాపీగా వచ్చి 3ఓ తెలుగూ పుస్తక్ దో2అన్నాడు. షాపువాడు తికమక పడ్డాడు. గత రెండువారాల నుండి ఈ పుస్తకం చూసి పోతున్నాడీపెద్దమనిషి. అక్కడే నిలబడి పేజీలు తిప్పుతున్నాడు. కాని ధర2దగ్గర ఆగిపోయాడు. అది ఆ షాపువాడు గమనించాడు. అందుకే ధర ఎక్కువగా చెప్పాడు నాకు. నిజానికి ఎవరూ కొనని పుస్తకం అది. నేను అప్పటికే డబ్బులు షాపువాడి చేతిలో పెట్టాను. ఆ పెద్దమనిషి తాను ముందే ఆ పుస్తకం చూశానని తనకు కావాలని అడుగుతున్నాడు. అలా పది నిమిషాలు గడిచింది. డబ్బులు మొదట ఇచ్చాను. కాబట్టి నాకా పుస్తకం ఇచ్చాడు షాపువాడు. ఆ పెద్దమనిషిలో నిరుత్సాహఛాయలు కదిలాయి. మీకు ఈ పుస్తకం అంతగా నచ్చిందా అని అడిగాను. ఇదే రచయితది వేరే పుస్తకం ఈమధ్య చదివాను. విచిత్రమైన అంశాలు రాశాడు. అందుకే ఆరోగ్యం బాగోలేకపోయినా ఈ పుస్తకం కొనాలని వచ్చాను అన్నాడు. ఆ పుస్తకాన్ని ఆరాధనగా నా చేతులు నిమిరాయి. మీరు చదివాక నాకు ఓసారి ఇవ్వండి. ఆ ధర నేనిస్తాను అన్నాడు. సరే అన్నాను. మీరేం చేస్తున్నారు అని నన్ను అడిగాడు వెళ్ళిపోతున్న వాడల్లా. పేరు చెప్పి తెలుగు అకాడమిలో పనిచేస్తున్నానని కూడా చెప్పాను. అతను వెళ్ళాక ప్రసిద్ధ పరిశోధకులు బూధరాజు రాధాకృష్ణగారు ఆ వేపు వచ్చారు. ఏమోయ్ నార్ల వెంకటేశ్వరరావుతో అంతసేపు మాట్లాడుతున్నావ్. ఏం సంగతి? ఆరా తీశారు. జరిగింది చెప్పాను.
అలా కొన్న తెలుగా, ఆంధ్రమా? పుస్తకం నా గ్రంథ సేకరణలో ఎక్కడో కూరుకుపోయింది. ముఖ చిత్రంపోయిన కారణంగా అదేదో పిచ్చి పుస్తకం అయిపోయింది. మూడేళ్ళ కింద దాన్ని మళ్ళీ చదివినప్పుడు మొదటిసారి తగిలిన షాక్లే మళ్ళీ.
ఆ చిన్ని పుస్తకం ఎన్నో ఆలోచనల ప్రయోగశాల. ఒక్కో వాక్యం ఒక వ్యాసంగా మలచగలిగినంత గొప్పది. బంగారయ్య అనే అల్పనామం కాకుండా సాహిత్య వ్యవస్థలో కనుపించే పెద్ద పేర్లలాగా ఉండిఉంటే ఆ పుస్తకానికి గుర్తింపు వచ్చేదేమో. పేరు పెద్దరికం కూడా సాహిత్యాన్ని శాసిస్తుందనడానికి బంగారయ్య ఒక ఉదాహరణ. ఐతే విచిత్రంగా బంగారయ్య పాఠశాల తరగతి గదిలో పిల్లల పేర్లతో పంతుళ్ళు వారి సామాజిక స్థితిగతిని అంచనావేసి తక్కువ చూస్తారని రాశాడు. అదే విషయం అతనికి కూడా వర్తించింది.
ఒక గొప్ప భాషా తాత్వికుడి గ్రంథానికి ఇలా జరగడం గొప్ప విషాదం. దీనివల్ల బంగారయ్య కీర్తి అపకీర్తులకు ఏమీ భంగం వాటిల్లలేదు. ఆయన కీర్తిప్రతిష్టలకు పాకులాడలేదు. కాని ఆ పుస్తకాలలో చర్చించిన వౌలికాంశాలు చాలా కొత్త విషయాలను ప్రతిపాదించాయి. వాటిని అందుకోలేక పోయాం. ఏ విషయాల వల్లనైతే తెలుగు సమాజానికి శాస్ర్తియ ఆలోచన స్థాయి పెరిగేదో అలాంటి ఆలోచనలు చాలాకాలం దూరం కావడం బాధాకరం.
Add new comment