-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
నూజివీడు, సెప్టెంబర్ 21: రాజీవ్ గాంధీ సాంకేతిక, వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుండి లక్షలాది రూపాయలు దండుకున్న ఉద్యోగి ఉదంతం వెలుగు చూసింది.
ఉయ్యాలవాడ, సెప్టెంబర్ 21: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మాయలూరు మధ్య కుందరవాగులో శనివారం తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. లారీలోని ముగ్గురిని పోలీసులు రక్షించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన లారీ కోవెలకుంట్లకు వెళ్తూ మార్గమధ్యంలో కుందరవాగు దాటుతుండగా వరద తీవ్రతకు బోల్తాపడింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: తీవ్రమయిన మనీలాండరింగ్ కేసులను దర్యాప్తు చేసే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తులో భాగంగా స్థిర, చరాస్తులను జప్తు చేయడాన్ని మనం చూస్తుంటాం. కాని, ఈ ఉదంతంలో ఈడీ మూడు చింపాంజీలను, నాలుగు అమెరికన్ కోతులను స్వాధీనం చేసుకుంది. అవును, ఇది నిజం.
కోల్కత్తా, సెప్టెంబర్ 21: బహుళ కోట్ల రూపాయల గోల్మాల్ జరిగిన శారదా చిట్ ఫండ్ డిపాజిట్ల కుంభకోణం కేసులో నిందితుడైన పశ్చిమ బెంగాల్ అదనపు డీజీ రాజీవ్ కుమార్ కోసం సీబీఐ అధికారుల బృందం గాలింపు కొనసాగుతున్నది. రాజీవ్ కుమార్ కోసం చేపట్టిన అనే్వషణలో భాగంగా సీబీఐ అధికారులు శనివారం భవానీ భవన్లో ఉన్న సీఐడీ కార్యాలయానికి చేరుకుని ఆచూకి కోసం ఆరా తీశారు.
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 21: సూర్యారావుపేట పోలీస్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గు రయ్యాడు. మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ హత్యకు దారి తీసినట్లు భావిస్తున్నారు. కాగా ఘటనకు సంబంధిం చి ప్రాథమిక ఆధారాల కోసం దర్యాప్తు అధికారులు అనే్వషిస్తున్నారు. పోలీసు లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అరండల్ పేట సంజీవయ్య కాలనీకి చెందిన మలిశెట్టి మనోజ్కుమార్ (27) కు తల్లిదండ్రులు లేరు.
షాబాద్, సెప్టెంబర్ 20: పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్రెడ్డి ప్రయాణిస్తున్న కారు శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుండి పరిగి వెళుతుండగా చేవెళ్ల పెట్రోల్ పంపు దగ్గర ఎదరుగా వస్తున్న కారు ఎమ్మెల్యే కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు వివరించారు.
మధురవాడ, సెప్టెంబర్ 20: విశాఖ జిల్లా మధురవాడలోని చైతన్య కళాశాల హాస్టల్లో కలుషిత ఆహారం కారణంగా సుమారు 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వడంతో స్థానిక ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. కొమ్మాదిలోని మైత్రి భవన్లో శ్రీచైతన్య మహిళా కళాశాల నిర్వహిస్తున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థినులకు హాస్టల్ సదుపాయం కూడా ఉంది.
మచిలీపట్నం, సెప్టెంబర్ 20: నర్సింగ్ విద్యాసంస్థను నిర్వహిస్తున్న ఓ ప్రబుద్ధుడు తన కోర్కె తీర్చమని ఓ విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసిన సంఘటన కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో చోటు చేసుకుంది. స్థానిక మల్కాపట్నంలోని గ్రేస్ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీనర్సింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని కరస్పాండెంట్ రమేష్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గుంటూరు (లీగల్), సెప్టెంబర్ 20: రాష్ట్ర హైకోర్టును అమరావతి నుండి తరలించరాదని, 13 జిల్లాలకు మధ్య భాగంలో కేంద్రీకృతమై ఉన్న హైకోర్టు ప్రస్తుతం అన్ని జిల్లాల వారికి అనుకూలంగా ఉందని పలు జిల్లాల న్యాయవాదుల ప్రిసీడియం సభ్యులు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్కు వినతిపత్రం సమర్పించారు.
వరంగల్, సెప్టెంబర్ 20: అభం శుభం తెలియని చిన్నారిని బలిగొన్న మానవ మృగాడికి సరైన శిక్షే పడింది. 21 నెలల పాటు కొనసాగిన ఈ కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ వరంగల్ జిల్లా అదనపు కోర్టు జిల్లా న్యాయమూర్తి శుక్రవారం సంచలనమైన తీర్పు వెల్లడించారు. మొత్తం 14 మంది సాక్షులను విచారించిన అనంతరం న్యాయమూర్తి నిందితుడికి ఈ శిక్ష ఖరారు చేశారు.