S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/29/2018 - 01:59

పెదనందిపాడు, ఏప్రిల్ 28: మండల పరిధిలోని రావిపాడులో ఉత్సవమూర్తుల విగ్రహాలు శుక్రవారం అపహరణకు గురయ్యాయి. పడమట రామాలయంలో గల సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివార్ల విగ్రహాలు చోరీకి గురయ్యాయి. దాదాపు ఈ విగ్రహాల విలువ 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఓ ప్రవాస భారతీయుడు విరాళంగా ఈ విగ్రహాలను అందజేశారు. చోరీ విషయం తెలియడంతో ఎస్‌ఐ రామాంజనేయులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

04/29/2018 - 01:44

అవుకు, ఏప్రిల్ 28:మండల పరిధిలోని చెర్లోపల్లె గ్రామం సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో తండ్రి, కుమారుడు దుర్మరణం చెందగా మరో బాలిక తీవ్రంగా గాయపడింది. స్థానికులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు.. చెర్లోపల్లె గ్రామానికి చెందిన నంబి ఓబులేసు తన కుమారుడితో పాటు బంధువుల పిల్లలకు ఈత నేర్పించేందుకు అవుకు రిజర్వాయర్ వద్దకు వెళ్లాడు.

04/29/2018 - 01:26

నాగలాపురం, ఏప్రిల్ 28: అడవిపందులను అంతం చేయడానికి ఏర్పాటు చేసిన పేలుడు పదార్థాలు పేలడంతో ఇద్దరు ఉపాధి కూలీలు గాయపడిన సంఘటన శనివారం నాగలాపురం మండలం వెళ్లూరు గ్రామంలో జరిగింది. ఉపాధి కూలీల కథనం మేరకు వెళ్లూరు గ్రామ పంచాయతీకి చెందిన సుమారు 170మంది ఉపాధి కూలీలు వెళ్లూరు గ్రామ పరిధిలోని పరిగుంట వద్ద పంటకాలువ గుంతలు తీస్తున్న సమయంలో భూమిలో ఉన్న పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలాయి.

04/29/2018 - 00:36

ఉంగుటూరు, ఏప్రిల్ 28: మోటారు సైకిల్‌ను వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో ఇరువురు మృతిచెందగా, మరో ఇద్దరు చిన్నారులకు గాయాలైన సంఘటన శనివారం ఉంగుటూరు మండలం బాదంపూడి రైల్వే బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. చేబ్రోలు ఎస్సై వెంకట నాగరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉంగుటూరు మండలం బాదంపూడి బైపాస్ రోడ్డులో శనివారం చిన్నకారు మోటారు సైకిల్‌ను ఢీకొన్న ప్రమాదంలో పసలపూడి శివసత్యనారాయణ (42) మృతిచెందాడు.

04/29/2018 - 00:26

డీ.హీరేహాల్, ఏప్రిల్ 28 : రాయదుర్గం కేంద్రంగా డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. కొందరు అక్రమ సంపాదన కోసం దడ పుట్టించే డ్రగ్స్ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఫలితంగా యువకులు, విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసవుతున్నారు. ముఖ్యంగా పట్టణానికి చెందిన విద్యార్థులు ఎక్కువగా అలవాటు పడినట్లు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ వాడకంలో అధిక మంది 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.

04/29/2018 - 00:25

విడపనకల్లు, ఏప్రిల్ 28 : మండల పరిధిలోని పాల్తూరు గ్రామంలో శనివారం అర్ధరాత్రి బోయ పెద్ద వన్నప్ప (55)ను అదే గ్రామానికి చెందిన వన్నూర్‌స్వామి అలియాస్ సుత్తిగాడు దారుణంగా నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పాల్తూరు గ్రామానికి చెందిన పెద్ద వన్నప్ప అదే గ్రామంలోని వన్నూర్‌స్వామి అక్కకు, పెద్ద వన్నప్ప ఇంటి వద్ద రస్తా స్థలం విషయంలో సంవత్సరం క్రితం గొడవ జరిగింది.

04/29/2018 - 00:24

అనంతపురం అర్బన్, ఏప్రిల్ 28: జెరూసలెంకు వెళ్లడానికి వీసా రాలేదని మనస్తాపంతో జి. రాణాప్రతాప్‌కుమార్ (27) తన ఇంట్లో శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. మూడవ పట్టణ ఏఎస్‌ఐ నరసింహులు తెలిపిన వివరాల మేరకు లెక్చరర్ కాలనీలోని ర్యాంబో అపార్ట్‌మెంట్లో రాణాప్రతాప్‌కుమార్ తన తల్లిదండ్రులతో కలసి ఉంటున్నారు. చర్చి ఫాదర్‌గా రెండేళ్లపాటు శిక్షణ తీసుకొని రామచంద్రనగర్‌లో చర్చిలో ఫాదర్‌గా పనిచేస్తున్నారు.

04/29/2018 - 03:51

హైదరాబాద్: నగరంలో మరోసారి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. కూకట్‌పల్లిలోని ఓ ఇంటి తలుపులు పగులగొట్టి 40 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

04/28/2018 - 03:12

మంగళగిరి, ఏప్రిల్ 27: గుంటూరుజిల్లా మంగళగిరి పట్టణ పరిధిలోని కుప్పురావు కాలనీకి చెందిన తిరువీధుల లక్ష్మీనారాయణ (40) అనే వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున తన ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి చంపి తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య మరణాన్ని జీర్ణించుకోలేని లక్ష్మీనారాయణ పిల్లలను చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

04/28/2018 - 02:31

రామడుగు, ఏప్రిల్ 27: మండలంలోని గోపాలరావుపేటలో శుక్రవారం ఉదయం రాసభక్తుల సుమలత (25) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక ఎస్‌ఐ రవి కథనం ప్రకారం..మృతురాలి కుటుంబ పరిస్థితులు సరిగా లేవని, దీనికి తోడు తనకు వివాహం కాదేమోనని ఆందోళన చెందుతుండేదని, ఈ నేపథ్యంలో ఉదయం బాత్‌రూంకు వెళ్తానని చెప్పి అందరు చూస్తుండగానే సమీపంలోని వ్యవసాయ బావిలో దూకింది.

Pages