S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సుప్రీమ్ హీరో సాయిధరమ్తేజ్ హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తొలిప్రేమ, బాలు, డార్లింగ్ వంటి ప్రేమకథలని తెరెకెక్కించిన కరుణాకరన్, సాయిధరమ్తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ జరుగుతోంది.
మెగా పవర్ స్టార్ చరణ్ హీరోగా ‘రంగస్థలం’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని అటు ట్రేడ్ వర్గాల్లో ఇటు అభిమానుల్లో విపరీతమైన అంచనాలు పెంచేసింది. మార్చి 30న ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందరూ. ఈ సినిమా తరువాత చరణ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు కానుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటుడుగా గుర్తింపు తెచ్చుకున్న గుండు హనుమంతరావు (61) సోమవారం తెల్లవారు జామున మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కొన్ని రోజుల క్రితం కోలుకున్నట్లే కనిపించారు కానీ ఎవరూ ఊహించని విధంగా ఆయన హైదరాబాద్ ఎస్ఆర్నగర్లోని తన స్వగృహంలో తెల్లవారు జామున 3.30 గం.లకు తుదిశ్వాసను విడిచారు. ఆయన మరణం అందరినీ శోక సంద్రంలో ముంచేసింది.
నేచరల్ స్టార్ నాని సమర్పణలో వాల్పోస్టర్ సినిమా బ్యానర్పై రూపొందించిన చిత్రం ‘అ’!. కాజల్ అగర్వాల్, రెజీనా కసండ్ర, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, నిత్యామీనన్, మురళీశర్మ, ప్రియదర్శి తదితరులు నటించారు. ప్రశాంత్వర్మ దర్శకుడు. ప్రశాంతి త్రిపురరేని నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదలై మంచి టాక్తో రన్ అవుతున్న సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన విశేషాలు.. నేను ఇంజనీరింగ్ చదివాను. ‘అ’!
హీరో శ్రీకాంత్, నాజియా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రారా’. శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదలవుతుంది. విజీ చెర్రిష్ దర్శకుడు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్, నాని, తరుణ్, రఘుబాబు, అలీ, హేమ, సదానంద్, నిర్మాత అశోక్, ప్రతాప్, ఖయ్యుమ్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు. నాని మాట్లాడుతూ ‘‘నాకు అష్టాచెమ్మా నుండి శ్రీకాంత్తో మంచి పరిచయం ఉంది.
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల క్రేజీ కాంబినేషన్లో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. జె.్భగవాన్-జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నుంచి మొదలవ్వనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.్భగవాన్-జె.పుల్లారావు మాట్లాడుతూ..
ఇంద్రనీల్ సేన్ గుప్తా, జారాషా, అభిషేక్, కర్తవ్య శర్మ, నీరజ్, మృణాల్, మృదాంజలి కీలక పాత్రధారులుగా రాజ్ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఐతే 2.0’. ఫర్మ్ 9 పతాకంపై కె.విజయ రామారావు, హేమంత్ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్, టీజర్ను నిర్మాత రాజ్కందుకూరి, దర్శకురాలు నందినీరెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు.
సూపర్స్టార్ మహేష్బాబు హీరోగా నటిస్తున్న ‘్భరత్ అనే నేను’ షూటింగ్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మహేష్ వంశీ పైడిపల్లితో సినిమా చేయనున్నాడు. తాజాగా మరో దర్శకుడికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో తెలుసా... ‘అర్జున్రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్లో సంచలనం రేపిన సందీప్ వంగ?
కొన్నాళ్లుగా సరైన సినిమాలు లేక ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయిన హీరో సుమంత్ ఇటీవలే ‘మళ్లీ రావా’ లాంటి భిన్నమైన సబ్జెక్ట్ చేసి అందరి మెప్పూ పొందాడు. ఈ విజయం అందించిన కొత్త ఉత్సాహంతో ఆయన తన తర్వాతి సినిమాను శరవేగంగా పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం దర్శకత్వం వహిస్తున్నారు.
దాదాపు యాభై ఏళ్లుగా సినీ రంగంలో కథానాయికగా వెలుగులు విరజమ్ముతున్నారు అతిలోక సుందరి శ్రీదేవి (53). తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం- పరిశ్రమ ఏదైనా శ్రీదేవికి ఉన్న గుర్తింపు అసాధారణం. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిగా వీరాభిమానులున్నారు. ఐదు దశాబ్దాల కెరీర్లో వందలాది సినిమాల్లో నటించి మెప్పించారు. చివరిగా బాలీవుడ్ నాయికగా సెటిలై అక్కడే బోనీకపూర్ని పెళ్లాడి లైఫ్లో సెటిలయ్యారు.