S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు విశ్వవ్యాప్తం చేసిన సినిమాగా సత్తాచాటింది ‘బాహుబలి’. రాజవౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1050 కేంద్రాలలో 50 రోజులు పూర్తిచేసుకొని ఏ భారతీయ చిత్రానికి సాధ్యంకాని ఆల్ టైం రికార్డుని సృష్టించింది. ఇప్పటికే 1700 కోట్ల రూపాయలు వసూలు చేసిన మొదటి చిత్రంగా ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయింది.
పవర్స్టార్ పవన్కళ్యాన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవన్ 25వ చిత్రం జోరుగా హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదివరకే ఫిలిం సిటీలో భారీ షెడ్యూల్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. కీర్తి సురేష్, అను ఇమాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.
‘అల్లుడు శీను’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘జయ జానకి నాయక’ టైటిల్ను ఓకె చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ టైటిల్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. రకుల్ప్రీత్సింగ్, ప్రగ్నా జైస్వాల్, కేథరిన్లు నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శరత్కుమార్లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్కు అక్కడ ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. ఆమెతో సినిమాలు చేయడానికి ఇప్పటికీ దర్శక నిర్మాతలు లైన్లో ఉన్నారు. ఈమధ్యే బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించి మరింత క్రేజ్ పెంచుకున్న సన్నీకి సౌత్లో నటించేందుకు తెగ ఆసక్తి ప్రదర్శిస్తోంది.
కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్, అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాష్ ప్రధాన తారాగణంగా స్రవంతి మూవీస్, పి.ఆర్.సినిమాస్ పతాకాలపై రవికిశోర్ రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఆర్ఎఫ్సిలో తొలి షెడ్యూల్, వైజాగ్లో రెండో షెడ్యూల్ పూర్తిచేశామని తెలిపారు.
‘అ ఆ’ సినిమాతో కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకున్నాడు నితిన్. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ‘లై’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే హైదరాబాద్లో మరో షెడ్యూల్ను ప్రారంభించనున్నారు. అ ఆ తరువాత సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్న నితిన్, ఇండస్ట్రీలోకి ప్రవేశించి 15 సంవత్సరాలు పూర్తయ్యాయి.
బాహుబలి తరువాత ఆ రేంజ్లో రూపొందే సంఘమిత్ర సినిమా విషయంలో హీరోయిన్ కష్టాలు ఇంకా తగ్గలేదు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టైటిల్ రోల్లో ఇంతకుముందు శ్రుతిహాసన్ ఓకె అయ్యింది. కానీ ఎందుకో ఆమె తప్పుకోవడంతో ఇప్పుడు ఆ టైటిల్ రోల్ ఎవరు పోషిస్తారా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించిన దర్శక నిర్మాతలు.. లేటెస్టుగా నయనతార పేరు పరిశీలనలో పెట్టారట!
సందీప్కిషన్ కథానాయకుడిగా వంశీకృష్ణ దర్శకత్వంలో ఆర్.డి.జి. ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ డి.గోహిల్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశారు. సోలో హీరోగా సందీప్ కిషన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత కూడా సోలోగానే రూపొందిస్తుండడం విశేషం.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగన్నాథమ్ చిత్రం ఈనెల 23న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లేటెస్టు ఫొటో ఇది.
మహేష్బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న స్పైడర్ సినిమా పూర్తికావచ్చింది. ఇప్పటికే పది రోజులుగా చెన్నైలో క్లైమాక్స్ సన్నివేశాల్లో పాల్గొన్న మహేష్ ఆ షూటింగ్ను పూర్తిచేసి ప్రస్తుతం విదేశాల్లో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడి నుంచి వచ్చాక కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. 19 నుండి ఈ షూటింగ్ మొదలుకానుందని సమాచారం.