మెదక్

ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, డిసెంబర్ 26: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయాల అభివృద్దికి ఎంతో కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ అయ్యప్ప దేవాలయం జరిగిన మహా పడిపూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. మెదక్ అయ్యప్ప దేవాలయానికి సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు. అందరికీ అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని ఆమె ఆకాక్షించారు. అయ్యప్ప దేవాలయంలో పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవలు, గణపతి పూజలు, అభిషేకాలు జరిగాయి. గీతా స్కూల్ కరస్పాండెంట్ రామాంజనేయులు అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వైద్య శ్రీనివాస్‌శర్మ, రాజుశర్మ పంతుల్ల ఆధ్వర్యంలో గురుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డిని ఘనంగా సత్కరించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, టీఆర్‌ఎస్ నాయకులు కృష్ణాగౌడ్, జీవన్‌రావు, అరవిందగౌడ్, అయ్యప్ప స్వాములు, మార్కెట్ కమిటి డైరెక్టర్ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.