S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ మెస్సీ ‘డబుల్’

పారిస్, నవంబర్ 24: సూపర్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ రెండు గోల్స్ సాధించడంతో, చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో బార్సిలోనా ప్రీ క్వార్టర్స్ చేరింది. సెల్టిక్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా హీరో మెస్సీ మ్యాచ్ 24, 55 నిమిషాల్లో గోల్స్ సాధించి బార్సిలోనాను టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేయించాడు. గాయం కారణంగా విశ్రాంతి తీసుకొని, మళ్లీ బరిలోకి దిగిన అతను అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో అతను అర్జెంటీనా జట్టుకు వెన్నుముకగా మారాడు. కాగా, చాంపియన్స్ లీగ్ మ్యాచ్‌లో ఆరంభం నుంచి చివరి వరకూ బార్సిలోనా వ్యూహాత్మకంగా ఆడింది.

ప్రత్యేక వ్యూహంతో కోహ్లీకి కళ్లెం

మొహాలీ, నవంబర్ 24: భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుకు కళ్లెం వేయడానికి ఇంగ్లాండ్ జట్టు సిద్ధమవుతున్నది. ప్రత్యేక వ్యూహంతో అతనిని నియంత్రిస్తామని, సాధ్యమైనంత త్వరగా అవుట్ చేస్తామని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ అన్నాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మొదటి టెస్టు డ్రాకాగా, విశాఖపట్నం టెస్టులో ఇంగ్లాండ్ 246 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. కోహ్లీ రెండు టెస్టుల్లో కలిపి మొత్తం 248 పరుగులు సాధించాడు. వీటిలో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి.

హాంకాంగ్ ఓపెన్ బాడ్మింటన్ క్వార్టర్స్‌లో సింధు, సైనా

కౌలూన్, నవంబర్ 24: హాంకాంగ్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్లు పివి సింధు, సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్స్ చేరారు. రెండో రౌండ్‌లో ఈ ఇద్దరు హైదరాబాదీలు తమతమ ప్రత్యర్థుల నుంచి ఎదురైన పోటీని తట్టుకొని నిలబడ్డారు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి, గత వారం చైనా ఓపెన్‌ను సొంతం చేసుకున్న సింధు రెండో రౌండ్‌లో హు యాచింగ్‌ను 21-10, 21-14 తేడాతో ఓడించింది. మొదటి సెట్‌ను సునాయాసంగా గెల్చుకున్న ఆమెకు రెండో సెట్‌లో యాచింగ్ నుంచి ప్రతిఘటన ఎదురైంది.

‘మిషన్ మోడ్’లో డిజిటల్ బ్యాంకింగ్ వృద్ధి

న్యూఢిల్లీ, నవంబర్ 24: దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను ‘మిషన్ మోడ్’లో శరవేగంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం బ్యాంకులకు సూచించారు. పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం భౌతికంగా నగదు వినియోగాన్ని తగ్గించడమేనని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల అధినేతలతో గురువారం ఆయన న్యూఢిల్లీలో సమావేశమైన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మాస్టర్, వీసా కార్డులపై ఎండిఆర్ మాఫీ : ఎస్‌బిఐ

న్యూఢిల్లీ, నవంబర్ 24: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూపే డెబిట్ కార్డులపై గత వారమే ఎండిఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేటు)ను మాఫీ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) తాజాగా మాస్టర్, వీసా డెబిట్ కార్డులపై కూడా ఎండిఆర్‌ను మాఫీ చేసింది. ఆర్థిక లావాదేవీల్లో కార్డుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించడం ద్వారా భౌతికంగా నగదు వినియోగాన్ని తగ్గించేందుకు మాస్టర్, వీసా డెబిట్ కార్డులపై ఎండిఆర్‌ను మాఫీ చేస్తున్నామని, ఈ మాఫీ డిసెంబర్ 31వ తేదీ వరకు అమలులో ఉంటుందని ఎస్‌బిఐ చైర్మన్ అరుంథతీ భట్టాచార్య గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

రెండు రోజుల ముచ్చటే

ముంబయి, నవంబర్ 24: వరసగా రెండు రోజులు లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లనుంచి విదేశీ పెట్టుబడులు భారీ ఎత్తున తరలివెళ్లిపోతుండడంతో డాలరుతో రూపాయి గతంలో ఎన్నడూ లేనంత కనిష్టస్థాయికి పడిపోయిన నేపథ్యంలో సెనె్సక్స్ 192 పాయింట్లు నష్టపోయి 26,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ సైతం దాదాపు 68 పాయింట్లు నష్టపోయి 8 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. నిన్నటి ముగింపుకన్నా కాస్త దిగువన 26,049.14 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెనె్సక్స్ అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక దశలో 25,810.97 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది.

ఏపిఐఐసికి చెక్!

విజయవాడ, నవంబర్ 24: పరిశ్రమలు రాకుండా మోకాలడ్డుతున్న అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాసాంధ్రులు సహా అనేక సంస్థలు ముందుకురావాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాళ్లకుబలపాలు కట్టుకుని చేస్తున్న విదేశీ పర్యటనలకు స్పందన లభిస్తోంది. ఆ మేరకు ఎన్‌ఆర్‌ఐలు, ఇతర రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తున్నా వారికి కనీస స్థాయిలో అధికారుల నుంచి సహకారం కరవవడం విమర్శలకు దారితీసింది. ఏపిఐఐసి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా సమాధానాలిస్తూ వచ్చిన పారిశ్రామికవేత్తల్లో నిరుత్సాహం నింపుతున్నారు.

రూపాయి విలవిల

ముంబయి, నవంబర్ 24: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభావం, సమీప భవిష్యత్తులోనే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న భయాలు పెరిగిన నేపథ్యంలో డాలరుతో రూపాయి గురువారం దారుణంగా పడిపోయింది. ఒక దశలో డాలరుకు 68రూపాయల 86 పైసల స్థాయికి పడిపోయింది. అయితే రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో కాస్తకోలుకుని రూ. 68.73 స్థాయి వద్దముగిసింది. 39 నెలల కాలంలో డాలరుతో రూపాయి ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఇదే ధోరణి కొనసాగితే సమీప భవిష్యత్తులోనే 70 రూపాయల స్థాయికి చేరుకోవచ్చని విశే్లషకులు అంటున్నారు.

సింగరేణితో మహారాష్ట్ర జెన్కో ఒప్పందం

హైదరాబాద్, నవంబర్ 24: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాలుగు నెలల్లో సింగరేణి నుంచి మరో పది లక్షల టన్నుల బొగ్గును కొనుగోలు చేయడానికి మహారాష్ట్ర జెన్కో తాజాగా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గురువారం సాయంత్రం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర జెన్కో ఉన్నతాధికారి అరవింద్ కె.చంద్రగడే, సింగరేణి జనరల్ మేనేజర్ బి.కిషన్‌రావు ఈ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు. సింగరేణి నుంచి పది లక్షల టన్నుల బొగ్గు కొనుగోలు చేసేందుకు తమిళనాడు రాష్ట్ర విద్యుత్ శాఖ ఒప్పందం చేసుకున్న మరుసటి రోజే మహారాష్ట్ర కూడా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఆ మూడు రాష్ట్రాల్లో రీకౌంట్ కోరండి

న్యూయార్క్, నవంబర్ 24: ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులకు పోలయిన ఓట్లను తారుమారు చేసేందుకు సైబర్ దాడి జరగలేదని నిర్ధారించుకోవడానికి కీలక రాష్ట్రాలయిన విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో రీకౌంట్‌ను కోరాలని ఎన్నికల న్యాయవాదులు, డేటా నిపుణులు హిల్లరీ క్లింటన్‌కు సలహా ఇచ్చారు. అయితే ఎన్నిల్లో అక్రమాలు జరిగాయని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తారుమారు చేవారనేదానికి ఎలాంటి సాక్ష్యాధారాలులేవని వారంటున్నారు. రీకౌంట్‌ను కోరడానికి గడువు దగ్గర పడుతున్నందున ఈ మూడు రాష్ట్రాల్లో రీకౌంటింగ్‌ను కోరనున్నారా లేదా అనే దానిపై హిల్లరీ క్లింటన్ ప్రచార బృందం మాత్రం స్పందించలేదు.

Pages