నేడే మోదీ రాక
Published Friday, 25 November 2016హైదరాబాద్, నవంబర్ 24: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేంద్రీయ పోలీస్ సంస్థల అధిపతుల 51వ వార్షిక సమావేశం శుక్రవారం ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమిలో మూడు రోజులపాటు జరుగునున్న సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ హాజరుకానున్నారు. ఈ సమావేశం సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు రాష్టప్రతి పోలీస్ పథకాలను, పోలీస్ పథకాలను ప్రదానం చేస్తారు. ఈ జాతీయ సదస్సును 2013 వరకు ప్రతి యేటా ఢిల్లీలో నిర్వహిస్తూ వచ్చారు.