సినిమాలతో ప్రజల హృదయాలను స్పందింపచేసిన దాసరి
Published Saturday, 28 May 2016హైదరాబాద్, మే 27: ‘తాతామనవడు’ చిత్రం ద్వారా సినీ దర్శకుడిగా పరిచయమై ప్రేమాభిషేకం, ఓసేరాములమ్మ, కంటే కూతురినే కనాలి వంటి సందేశాత్మక చిత్రాలను కలుపుకుని 150 చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావును తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య ఘనంగా సత్కరించారు. చిత్రాలద్వారా ప్రజా హృదయాలను స్పందింపచేసిన దాసరి నారాయణరావు అని రోశయ్య కొనియాడారు. దాసరి సినీ ప్రస్తానం కొనసాగించాలని చెబుతూ ఢిల్లీ అకాడమీని ప్రశంసించారు.