అడెగాం ప్రాజెక్టుపై చిగురిస్తున్న రైతుల ఆశలు
Published Saturday, 28 May 2016ఇచ్చోడ, మే 27: అడెగాంకె ప్రాజెక్టు కింద కాలువల నిర్మాణాని మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ.2కోట్ల 8లక్షల నిధులు మంజూరు కావడంతో కాలువల పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు దశాబ్దకాలం కింద జిలయజ్ఞంలో రూ.2కోట్ల 83లక్షలు మంజూరు చేసి నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగినా కాలువల నిర్మాణానికి నిధులు లేకపోవడంతో రైతుల భూములకు చుక్కనీరుకూడా అందలేదు. ఈ ప్రాజెక్టులో 140 ఎకరాల భూమి ముంపునకు గురికాగా సుమారు 1100 ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో నిర్మాణం జరిగింది.