ఉద్యమంలా మరుగుదొడ్లను పూర్తి చేయాలి
Published Wednesday, 4 May 2016గంగాధర, మే 3: గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమంలా తీసుకొని పూర్తి చేయాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ప్రజాప్రతినిధులను, అధికారులను కోరారు. మంగళవారం గంగాధర శివారులోని శుభమస్తు ఫంక్షన్ హాలులో జరిగిన చొప్పదండి నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ అందరం సమష్టిగా కష్టపడితేనే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 50 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు.