నిమ్స్లో దోపిడీకి గురౌతున్న ఆరోగ్యశ్రీ రోగులు
Published Wednesday, 4 May 2016ఖైరతాబాద్, మే 3: ఇరు రాష్ట్రాల్లోనే కాక దేశంలోనే పేరెన్నిక గాంచిన నిమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ రోగులు దోపిడీకి గురౌతున్నారు. కార్పొరేట్ వైద్యాన్ని తక్కువ ఖర్చుకే అందిస్తున్నట్టు నిత్యం చెప్పుకునే నిమ్స్లో ఆరోగ్యశ్రీ రోగులు నరకాన్ని చవిచూస్తున్నారు. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించే సదుద్దేశంతో తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకం అమలులో నిమ్స్ యాజమాన్యం అలసత్వం వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో నిమ్స్ ఆసుపత్రిలో ఓపి సేవలను ఉచితంగా అందించడంతో పాటు వైద్యపరీక్షలపై 25శాతం రాయితీ ఇచ్చేవారు.