పిడుగుపాటుకు నలుగురికి గాయలు
Published Wednesday, 4 May 2016ఆదిలాబాద్, మే 3: జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా సాయంత్రం వాతావరణం చల్లబడి పెనుగాలులతో ఉరుములు మెరుపులకు తోడు పిడుగులు పడడంతో నలుగురు మృతిచెందారు. మంగళవారం 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా వడదెబ్బకు గురై ముగ్గురు మృతి చెందారు. లక్సెటిపేట మండలం వెంకట్రావ్పేట్ గ్రామానికి చెందిన వేమూరి రమేష్(40) వడదెబ్బ సోకి కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందగా ఇదే మండలంలో వెల్కపల్లి గ్రామానికి చెందిన పోటు మల్లేష్ (38) మృతి చెందాడు. దండేపల్లి మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన ఆడె సోముబాయి (55) అనే మహిళ వడదెబ్బసోకి మృతి చెందింది.