వట్టిపోయన జూరాల
Published Wednesday, 4 May 2016గద్వాల, మే 3: జూరాల ప్రాజెక్టు నిర్మాణమై మూడు దశాబ్దాలు పూర్తయినా ఇంతటి దుర్బిక్ష పరిస్థితులు ఎప్పుడు దాపురించలేదు. ఈ ఏడాది ఆయకట్టు రైతులకు సాగునీరు అందించకపోగా ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్న ప్రజల దాహార్థిని కూడ తీర్చలేక పోయింది. దాదాపు సగం జిల్లాకు తాగునీరు అందించే జూరాల ప్రాజెక్టు నుంచి కాలువల్లోకి నీటిని తోడేందుకు రంగం సిద్దమైంది. చరిత్రలో ఎన్నడులేని రీతిలో జూరాల ప్రాజెక్టులో నీటి మట్టాలు పడిపోయాయి. ప్రాజెక్టు అధారిత బ్యాలెన్స్ రిజర్వాయర్లను రామన్పాడు, గోపన్పాడు, జములమ్మ రిజర్వాయర్లలోనూ నీరు అడుగంటింది. ఈ రిజర్వాయర్ల ఆధారంగా జిల్లాలో సగం ప్రాంతాలకు తాగునీరు అందిస్తున్నారు.