-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
అడెలైడ్, నవంబర్ 17: ఇంగ్లాండ్తో స్వదేశంలో జరిగే ప్రతిష్ఠాత్మక యాషెస్ టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన ఆస్ట్రేలియా జట్టులో వికెట్కీపర్ టిమ్ పైన్కు చోటు దక్కింది. ఐదు మ్యాచ్ ఈ టెస్టు సిరీస్లో మొదటి రెండు టెస్టులకు 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఆస్ట్రేలియా జాతీయ సెలక్షన్ కమిటీ శుక్రవారం ఎంపిక చేసింది. ఎవరూ ఊహించని విధంగా 32 ఏళ్ల పైన్ను జట్టులోకి తీసుకున్నారు.
ఇండోర్, నవంబర్ 17: రెండు పర్యాయాలు ఒలింపిక్స్ పతకాలను కైవసం చేసుకున్న సీనియర్ రెజ్లర్ సుశీల్ కుమార్కు ఇక్కడ జరుగుతున్న జాతీయ రెజ్లింగ్ చాంపియన్షిప్స్ పురుషుల 74 కిలోల విభాగంలో చెమటోడ్చకుం డానే స్వర్ణ పతకం లభించింది. మొత్తం మీద అతను కేవలం రెండు నిమిషా ల 33 సెకన్లు మాత్రమే మ్యాట్పై కనిపించాడు.
ఫుజోలో జరుగుతున్న చైనా ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్స్ చేరిన భారత స్టార్ సింధు. రెండో రౌండ్లో హాన్ ఇయూని ఆమె 21-15, 21-13 తేడాతో ఓడించింది. అయితే, మరో స్టార్ సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ తమతమ మ్యాచ్ల్లో పరాజయాలను ఎదుర్కొని, టోర్నీ నుంచి నిష్క్రమించారు
కోల్కతా, నవంబర్ 16: అందరూ భయపడుతున్నట్టుగానే ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య గురువారం ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ని వర్షం బెడద వెంటాడింది. మొదటి రోజు కేవలం 11.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. రోజులో ఎక్కువ భాగం ఈడెన్ గార్డెన్స్ పిచ్ కవర్ల కిందే ఉండిపోయింది.
కోల్కతా: భారత్, శ్రీలంక జట్ల మధ్య మొదటి టెస్టులో ఎన్ని రోజులు లేదా ఎన్ని గంటల ఆట సాధ్యమవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. జల్లులు కురుస్తున్న నేపథ్యంలో మొదటి రోజైన గురువారం నాటి ఆటలో మొదటి రెండు సెషన్లలో ఒక్క ఓవర్ కూడా బౌల్ కాలేదు.
కొచ్చి, నవంబర్ 16: ఎనిమిది జట్ల స్థానంలోనే పది జట్లు.. రెండు నెలల నుంచి నాలుగు నెలలకు పెరిగిన నిడివి. ఫుట్బాల్ విందును అందించడానికి నాలుగో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ సిద్ధంగా ఉంది. నిరుటి విజేత అట్లాటికో డి కోల్కతా (ఏటీకే), రన్నరప్ కేరళ బ్లాస్టర్స్ జట్ల మధ్య ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం జరిగే మ్యాచ్తో తాజా సీజన్ మొదలుకానుంది.
న్యూఢిల్లీ, నవంబర్ 16: పాలనాధికారుల బృందం (సీఓఏ) ఆదేశాల ప్రకారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) నిర్ణయించింది. డిసెంబర్ ఒకటిన ఈ సమావేశం జరుగుతుందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
కోల్కతా: తాను రోబోను కానని, తనకూ విశ్రాంతి అవసరమని భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది ఇప్పటి వరకూ అతను 7 టెస్టులు, 26 వనే్డలు, మరో 10 టి-20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. అవిశ్రాంతంగా మ్యాచ్లు ఆడుతున్నందువల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోతామని అన్నాడు. కొన్ని మ్యాచ్లు లేదా సిరీస్ల నుంచి విశ్రాంతి కోరుతున్నారా?
కోల్కతా, నవంబర్ 15: శ్రీలంక టూర్కు వెళ్లినప్పుడు అన్ని ఫార్మాట్స్లో కలిపి 9-0 తేడాతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మరోసారి అదే ఫలితంపై గురిపెట్టింది. గురువారం నుంచి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే మొదటి మ్యాచ్తో టెస్టు సిరీస్ మొదలవుతుంది.
కోల్కతా: కెప్టెన్గా భారత్కు ఎక్కువ విజయాలు సాధించిపెట్టిన కెప్టెన్ల జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించే దిశగా విరాట్ కోహ్లీ దూసుకెళుతున్నాడు. శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో మొదటి రెండు మ్యాచ్ల్లో టీమిండియా గెలిస్తే, ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న సౌరవ్ గంగూలీ సరసన కోహ్లీకి చోటు దక్కుతుంది. మూడో టెస్టు నుంచి అతనికి విశ్రాంతినిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.