-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
వనే్డ, టి-20 ఫార్మాట్స్లో ప్రపంచ కప్ చాంపియన్షిప్తోపాటు చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్కు టైటిళ్లను అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారత మూడో అత్యుత్తమ పౌర పురస్కారం పద్మభూషణ్ లభించే అవకాశాలున్నాయి. దేశానికి అత్యుత్తమ సేవలు అందిస్తున్న అతనిని ఈ పురస్కారంతో గౌరవించాలని ప్రతిపాదిస్తూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కేంద్రానికి లేఖ రాసింది.
ఆంట్వెర్ప్ (బెల్జియం), సెప్టెంబర్ 19: బెల్జియం పురుషుల జూనియర్ జట్టుతో జరిగిన హాకీ మ్యాచ్లో భారత మహిళా జట్టు సత్తా చాటుకుంది. ఆరంభంలో ఏకపక్షంగా సాగినప్పటికీ ఆ తర్వాత ఉత్కంఠ భరితంగా మారిన ఈ మ్యాచ్లో భారత మహిళా జట్టు 4-3 గోల్స్ తేడాతో విజయభేరి మోగించి యూరప్ పర్యటనను ఘనంగా ముగించింది. గుర్జీత్ కౌర్, కెప్టెన్ రాణి చెరో రెండు గోల్స్తో రాణించి భారత జట్టుకు ఈ విజయాన్ని అందించారు.
అస్ఘబత్ (తుర్క్మెనిస్తాన్), సెప్టెంబర్ 19: తుర్క్మెనిస్తాన్లోని అస్ఘబత్లో జరుగుతున్న ఆసియా ఇండోర్ గేమ్స్, మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో భారత్ జోరు కొనసాగుతోంది. నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన ఈ పోటీల్లో భారత్ మరో మూడు పతకాలను కైవసం చేసుకుంది. వీటిలో రెండు పసిడి పతకాలు, ఒక కాంస్య పతకం ఉన్నాయి.
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం రెండవ వనే్డ మ్యాచ్కి ఆతిథ్యం ఇవ్వనున్న
కోల్కతా నగరంపై దట్టంగా మేఘాలు అలుముకున్నాయ. దీంతో ఈ మ్యాచ్ జరగాల్సిన
ఈడెన్ గార్డెన్ను పరదాలతో కప్పివేయడంతో మంగళవారం భారత జట్టు తమ ప్రాక్టీస్ సెషన్ను పూర్తిగా రద్దు చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు సభ్యులు మాత్రం ఇండోర్లో సాధన చేశారు.
ముంబయి, సెప్టెంబర్ 19: కపిల్ దేవ్ నిష్క్రమణ తర్వాత భారత క్రికెట్ జట్టుకు హార్దిక్ పాండ్యా రూపంలో అసలైన ఆల్ రౌండర్ లభించాడని భారత క్రికెట్ జట్టు మాజీ మేనేజర్ లాల్చంద్ రాజ్పుత్ అభిప్రాయపడ్డాడు. 3హార్దిక్ పాండ్య ఓ అద్భుతమైన క్రికెటర్. జాతీయ క్రికెట్ అకాడమీలోను, జోనల్ క్యాంప్లోను నేను అతడ్ని దగ్గరినుంచి చూశాను. అతనికి అద్భుతమైన టాలెంట్ ఉంది.
టోక్యో, సెప్టెంబర్ 19: జపాన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల యువ ఆటగాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ దుమ్ము రేపాడు. మంగళవారం ఇక్కడ జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ పోటీల్లో అసాధారణ శక్తిసామర్ధ్యాలను ప్రదర్శించిన అతను ఏకంగా నాలుగు మ్యాచ్లలో విజయభేరి మోగించి పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో మెయిన్ డ్రాలో ప్రవేశించాడు.
కోల్కతా, సెప్టెంఫర్ 19: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ పెద్ద సవాలును ఎదుర్కొంటున్నాడని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయ పడ్డాడు. విజయాలకోసం అతను కొత్త మార్గాలను వెతకాల్సిన సమయం వచ్చిందన్నాడు. 3బ్యాట్స్మన్గా స్మిత్ అద్భుతంగా రాణిస్తున్నాడనడంలో సందేహం లేదు. అయితే అతని కెప్టెన్సీ ఇప్పుడు సవాళ్లతో నిండి ఉంది.
పనాజీ, సెప్టెంబర్ 19: న్యూఢిల్లీలో వచ్చే నెల 6వ తేదీన ప్రారంభమై దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగనున్న ఫిఫా అండర్-17 ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భారత జట్టుకు మిడ్ ఫీల్డర్ అమర్జీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. భారత జట్టు కెప్టెన్గా అతను ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ హాకీ లీగ్-2017 టోర్నమెంట్లో పాల్గొనేందుకు 18 మంది సభ్యులతో కూడిన ఇండియా-ఏ మహిళా జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) మంగళవారం నాడు ప్రకటించింది. ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో ఇండియా-ఏ జట్టుకు ఫార్వర్డ్ క్రీడాకారిణి ప్రీతి దూబే సారథ్యం వహించనుండగా, వైస్-కెప్టెన్సీ బాధ్యతలను ఉదిత నిర్వర్తించనుంది.
కోల్కతా, సెప్టెంబర్ 19: టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ తెండూల్కర్ జీవిత విశేషాలతో రూపుదిద్దుకున్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక వికెట్లు సాధించిన మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించిన ఝులన్ గోస్వామి జీవిత విశేషాలతో మరో చిత్రం వెండితెరపై కనువిందు చేయనుంది. ‘చక్దహా ఎక్స్ప్రెస్’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం.