-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
కార్డిఫ్, జూన్ 25: ఇంగ్లాండ్ యువ ఆటగాడు తాను ఆడిన తొలి టి-20 ఇంటర్నేషనల్లోనే సత్తా చాటాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి, మూడో టి-20లో 78 పరుగులు సాధించిన అ తను ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషిం చి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకు న్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగి న ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరు గులు చేసింది.
చిత్రం.. అలెగ్జాండర్ జ్వెరెజ్ను ఓడించి హాలే టెన్నిస్ టోర్నమెంట్ ట్రోఫీని సాధించిన రోజర్ ఫెదరర్
లీసెస్టర్, జూన్ 25: మహిళల ప్రపంచ కప్ చాంపియన్షిప్ పోటీల్లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్లో పాకిస్తాన్ను దక్షి ణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 206 పరుగులు చేసింది. నహిదా ఖాన్ 79 పరుగులతో రాణించగా, మిగతా వారు అనుకున్న స్థాయలో ఆడలేకపోయారు.
మహిళల ప్రపంచ కప్ చాంపియన్షిప్ శనివారం ఇంగ్లాండ్లో అట్టహాసంగా మొదలైంది. మొదటి రోజున రెండు మ్యాచ్లు జరిగాయ. ఒక మ్యాచ్లో ఇంగ్లాండ్ను భారత్ 35 పరుగుల తేడాతో ఓడించింది. మరో మ్యాచ్లో శ్రీలంకను న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల ఆధిక్యంతో చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్కు దిగిన లంక 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయ 188 పరుగులు చేసింది.
డెర్బీ, జూన్ 24: మహిళల ప్రపంచ కప్ చాంపియన్షిప్లో భారత్ శుభారంభం చేసింది. హైదరాబాదీ మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత్ అన్ని విభాగాల్లోనూ సత్తా చూపి, ఇంగ్లాండ్ను 35 పరుగుల తేడాతో ఓడించింది. ఓపెనర్లు పూనమ్ రావత్, స్మృతి మందానాతోపాటు కెప్టెన్ మిథాలీ కూడా అర్ధ శతకాలతో రాణించడంతో, భారత్ 50 ఓవర్లలో మూడు వికెట్లకు 281 పరుగులు చేయగలిగింది. అనంతరం ప్రత్యర్థిని 47.3 ఓవర్లలో246 పరుగులకే కట్టడి చేసింది.
సిడ్నీ, జూన్ 24: ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో భారత ఆటగాడు, తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ ఫైనల్ చేరాడు. సెమీ ఫైనల్లో అతను చైనాకు చెందిన షి యుకీని 21-10, 21-14 తేడాతో చిత్తుచేశాడు. సూపర్ సిరీస్ టోర్నమెంట్స్లో అతను ఫైనల్ చేరడం వరుసగా ఇది మూడోసారి. ఇంతకు ముందు సింగపూర్, ఇండోనేషియా సూపర్ సిరీస్ టోర్నీల్లో ఫైనల్ చేరాడు.
కొలంబో, జూన్ 24: శ్రీలంక క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవికి గ్రాహం ఫోర్డ్ రాజీనామా చేశాడు. 2019 ప్రపంచ కప్ ముగిసే వరకూ ఒప్పందం ఉన్నప్పటికీ, అతను హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో లంక సెమీ ఫైనల్ కూడా చేరలేకపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ అతను రాజీనామా చేసినట్టు సమాచారం. అయితే, కారణాలను శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సి) తన ప్రకటనలో ప్రస్తావించలేదు.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూన్ 24: వెస్టిండీస్తో ఆదివారం రెండో వనే్డకు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సిద్ధమైంది. మొదటి వనే్డ వర్షం కారణంగా రద్దయిన నేపథ్యంలో, రెండో మ్యాచ్ ఎలాంటి బెడద లేకుండా జరగాలని అటు క్రికెటర్లు, ఇటు అభిమానులు కోరుకుంటున్నారు. శుక్రవారం నాటి మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 39.2 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు సాధించింది.
జైపూర్, జూన్ 24: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)కు రూపకల్పన చేసి, దానిని ఒక గొప్ప ఈవెంట్గా తీర్చిదిద్దిన ఆ టోర్నీ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అతను అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నగర్ జిల్లా సంఘం (ఎన్డిఎ)పై రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్సిఎ) వేటు వేసింది.
లండన్, జూన్ 24: హాకీ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ టోర్నమెంట్లో భాగంగా ఐదు నుంచి ఎనిమిది స్థానాలకు జరిగిన క్లాసిఫికేషన్ మ్యాచ్లో భారత్ 6-1 తేడాతో పాకిస్తాన్ను చిత్తుచేసింది. రమణ్దీప్ సింగ్ (8, 28వ నిమిషం), ఆకాష్దీప్ సింగ్ (12, 27వ నిమిషం) రెండేసి గోల్స్చేశారు. హర్మన్ప్రీత్ సింగ్ (36వ నిమిషం), మన్దీప్ సింగ్ (59వ నిమిషం) ఒక్కో గోల్ సాధించారు.