-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
టౌన్టన్, జూన్ 24: క్రికెట్లో గొప్పగొప్ప రికార్డులే కాదు... ఒక్కోసారి ఎవరూ కోరుకోని రికార్డులు కూడా నమోదవుతాయి. ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ జాసన్ రాయ్ పొరపాటు చేసి, అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్గా అవుటయ్యాడు. టి-20 ఫార్మాట్లో ఈ విధంగా అవుటైన తొలి క్రికెటర్గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.
జైపూర్, జూన్ 24: జైపూర్ రోడ్డుపై భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫొటోతో ఉన్న భారీ బోర్డు అందరినీ ఆకట్టుకుంటున్నది. అయితే, దీని ఏర్పాటుపై బుమ్రా అసహనం వ్యక్తం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే, ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొంటూ, సిగ్నల్ వద్ద గీత దాటవద్దని జైపూర్ పోలీస్ శాఖ ఒక భారీ బోర్డును ఏర్పాటు చేసింది. దానిపై బుమ్రా నోబాల్ వేసినప్పటి ఫొటో ఉండడమే వివాదానికి కారణమైంది.
టెస్టు క్రికెట్: 1. రమీజ్ రజా (పాకిస్తాన్/ 1987 నవంబర్లో ఇంగ్లాండ్పై), 2. మొహీందర్ అమర్నాథ్ (్భరత్/ 1989 అక్టోబర్లో శ్రీలంకపై), 3. ఇంజమాముల్ హక్ (పాకిస్తాన్/ 2006 ఫిబ్రవరిలో భారత్పై), 4. మహమ్మద్ హఫీజ్ (పాకిస్తాన్/ 2013 మార్చిలో దక్షిణాఫ్రికాపై), 5. అన్వర్ అలీ (పాకిస్తాన్/ 2013 నవంబర్లో దక్షిణాఫ్రికాపై), 6. బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్/ 2015 సెప్టెంబర్లో ఆస్ట్రేలియాపై).
డెర్బీ, జూన్ 23: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆధ్వర్యంలో మహిళల ప్రపంచ కప్ చాంపియన్షిప్ శనివారం నుంచి మొదలుకానుంది. మిథాలీ రాజ్ నాయకత్వం వహిస్తున్న భారత్ మొదటి రోజు గ్రూప్ మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఢీ కొంటుంది. ప్రతిభావంతులు ఉన్నప్పటికీ, నిలకడగా ఆడలేరన్న ముద్ర వేయించుకున్న మిథాలీ సేన ఈ మ్యాచ్లో గట్టెక్కడానికి చాలా కష్టపడాలి.
లండన్, జూన్ 23: మహిళా క్రికెటర్లకు గుర్తింపు లభించడం లేదని భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఆవేదన వ్యక్తం చేసింది. క్రికెట్ను మతంలా ఆరాధించే దేశంలో మహిళా క్రికెట్ ఇలాంటి దుస్థితిని ఎదుర్కోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. మహిళల ప్రపంచ కప్ చాంపియన్షిప్లో భాగంగా శనివారం ఇంగ్లాండ్తో భారత్ మొదటి మ్యాచ్ ఆడనుంది.
లండన్, జూన్ 23: ప్రపంచ కప్ చాంపియన్షిప్లో ఇంత వరకూ మూడు నామమాత్రపు జట్లు సహా మొత్తం 14 జట్లు తలపడ్డాయి. మొదటి వరల్డ్ కప్లో టెస్టు హోదావున్న దేశాల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండడంతో, జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, యంగ్ ఇంగ్లాండ్ జట్లకు పోటీపడే అవకాశం కల్పించారు.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూన్ 23: వెస్టిండీస్తో శుక్రవారం మొదలైన మొదటి వనే్డలో ఆటకు వర్షం వల్ల ఆటంకం ఏర్పడింది. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 38 ఓవర్లలో మూడు వికెట్లకు 189 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం కురవడంతో ఆటను నిలిపేశారు. శిఖర్ ధావన్ 87, అజింక్య రహానే 62 పరుగులు చేయగా, యువరాజ్ సింగ్ నాలుగు పరుగులకే వెనుదిరిగాడు.
సిడ్నీ, జూన్ 23: ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్స్ చేరాడు. మహిళల విభాగంలో భారత్చు చుక్కెదురైంది. హైదరాబాదీలు పివి సింధు, సైనా నెహ్వాల్ తమతమ ప్రత్యర్థుల చేతిలో పరాజయాలను చవిచూసి నిష్క్రమించారు.
దుబాయ్, జూన్ 22: అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ జట్లకు టెస్టు హోదా లభించింది. ఈ రెండు దేశాల క్రికెట్ బోర్డులకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని మంజూరు చేయడం ద్వారా టెస్టు హోదాను కల్పించినట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకూ పది జట్లకు టెస్టు హోదా ఉండగా, అఫ్గాన్, ఐర్లాండ్ చేరికతో ఈ సంఖ్య 12కు పెరిగింది.
న్యూఢిల్లీ, జూన్ 22: కోట్లకు కోట్లు గడిస్తున్నా భారత క్రికెటర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారన్న వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. కోచ్ అనిల్ కుంబ్లేతో కెప్టెన్ విరాట్ కోహ్లీకి విభేదాలు తలెత్తడానికి ఇదే ప్రధానకారణ మన్న వాదన వినిపిస్తున్నది. ప్రస్తుతం వెస్టిండీస్ టూర్కు వెళ్లిన టీమిండియా స్వదేశానికి వచ్చిన వెంటనే కాంట్రాక్టు సొమ్ము పెంచాలన్న డిమాండ్ను వినిపించే అవకాశం ఉం ది.