-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
బ్రిడ్జిటౌన్, జూలై 14: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సిపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్లో బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టు మరో విజయాన్ని సాధించింది. బుధవారం రాత్రి బ్రిడ్జిటౌన్లో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 25 పరుగుల తేడాతో సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పేట్రియాట్స్ను ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
హైదరాబాద్, జూలై 13: మహిళలను మనం ఎంతగా ప్రేమిస్తామో, గౌరవిస్తామో అంత గొప్ప విజయాలను దేశం సాధిస్తుందని బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ ఖాన్ అన్నాడు. ఈ ప్రపంచంలో మహిళలకన్నా గొప్ప విజయాలు సాదించిన వారు మరెవరూ లేరని కూ ఆయన అన్నాడు. ఏస్ అగైనెస్ట్ ఆడ్స్’ పేరుతో టెన్నిస్ తార సానియా మీర్జా రాసిన ఆత్మకథ పుస్తకాన్ని షారుఖ్ ఖాన్ బుధవారం ఇక్కడ ఆవిష్కరించారు.
గయానా, జూలై 13: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సిపిఎల్) ట్వంటీ-20 క్రికెట్లో టేబుల్ టాపర్ గయానా అమెజాన్ వారియర్స్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో బౌలర్లు రయాద్ ఎమ్రిట్, సొహైల్ తన్వీర్, ఆడమ్ జంపాతో పాటు బ్యాట్స్మన్లు కూడా చక్కగా రాణించడంతో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో సెయింట్ లూసియా జౌక్స్ జట్టును మట్టికరిపించి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.
బసెటెర్రె (సెయింట్ కిట్స్), జూలై 13: వెస్టిండీస్తో నాలుగు టెస్టుల సిరీస్కు చివరి సన్నాహకంగా టీమిండియా గురువారంనుంచి ఇక్కడ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టుతో జరగనున్న మూడు రోజుల వామప్ మ్యాచ్కి సిద్ధమవుతోంది. ఈ మూడు రోజుల మ్యాచ్లో ప్రదర్శన ఆధారంగా జట్టులోని 11 మంది ఆటగాళ్లు ఎవరనేది దాదాపుగా తేలిపోతుంది.
న్యూఢిల్లీ, జూలై 13: పార్లమెంట్ సభ్యులు, బాలీవుడ్ సెలబ్రిటీలకు మధ్య ఈ నెల 24వ తేదీన న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో చారిటీ ఫుట్బాల్ మ్యాచ్ జరుగనుంది. ఈ ఈవెంట్కు ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు.
సెయింట్ జాన్స్, జూలై 13: టీమిండియాతో ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నాలుగు టెస్టుల సిరీస్లో తలపడే తమ జట్టులో జెరోమ్ టేలర్ స్థానాన్ని అన్క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్ మిగల్ కమ్మిన్స్తో భర్తీ చేస్తున్నట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) బుధవారం వెల్లడించింది.
న్యూఢిల్లీ, జూలై 13: కర్నీ సింగ్ స్మారక షూటింగ్ మీట్లో టాప్గన్ అకాడమీకి చెందిన షూటర్లు ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఏడు పసిడి పతకాలను కైవసం చేసుకున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,500 మందికి పైగా షూటర్లు పాల్గొన్నారు.
మరికా (బ్రెజిల్), జూలై 13: రియో ఒలింపిక్స్కు సన్నద్ధమైన భారత ఆర్చరీ జట్టు అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడేందుకు నాలుగు వారాల ముందే బ్రెజిల్ చేరుకుంది. భారత్ నుంచి రియో ఒలింపిక్స్కు వెళ్లిన తొలి జట్టు ఇదే. సపోర్టింగ్ స్ట్ఫాతో పాటు నలుగురు సభ్యులతో కూడిన ఈ జట్టు రియో డీ జెనిరోకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని తీరప్రాంత నగరం మరికాకు చేరుకుంది.
న్యూఢిల్లీ, జూలై 13: కాలేయ, మూత్రపిండ సమస్యలతో బాధపడుతూ గుర్గావ్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హాకీ లెజెండ్ మొహమ్మద్ షాహిద్ను క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ పరామర్శించారు. బుధవారం ఆయన గుర్గావ్లోని ఆసుపత్రికి వెళ్లి షాహిద్ను పరామర్శించారని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ముంబయి, జూలై 13: హాకీ ఒలింపియన్ జో ఆంటిక్ (90) కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆంటిక్ మంగళవారం రాత్రి ముంబయిలో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 1960లో రోమ్లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో రజత పతకాన్ని సాధించిన భారత జట్టులో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఆంటిక్కు కుమారుడు విలియమ్, కుమార్తె రీటా ఉన్నారు. ఆంటిక్ సతీమణి 2011లోనే కన్నుమూసింది.