-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 16: అమాయకులైన తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఆయన డిజిపి అనురాగ్ శర్మను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. తమ పార్టీ సీనియర్ నాయకుడు జి.నిరంజన్ కుమారులు జి.
హైదరాబాద్, జనవరి 16: విద్యార్ధి సమాచార గణనలో పాఠశాలలకు దాతలు ఇచ్చిన వివరాలు చెప్పాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు పాఠశాలల హెడ్మాస్టర్లను ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థలు స్థానిక దాతలు ముందుకు వచ్చి పాఠశాలలకు తమ వంతు సహకారం అందిస్తున్నారని అయితే ఆ వివరాలు మాత్రం హెడ్మాస్టర్లు లెక్కల్లో చెప్పడం లేదని తెలిసింది.
మక్తల్, జనవరి 15 : దశాబ్దాలుగా పేరుకుపోయిన నల్లధనం కారణంగా దేశం వినాశనానికి దారితీసిందని, అందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తిస్థాయి మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని కేంద్ర ఆరోగ్య, సంక్షేమ శాఖ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే అన్నారు.
ఆదిలాబాద్,జనవరి 15: ఉత్తరాది నుండి వీస్తున్న చలిగాలుల తాకిడికి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతపడిపోయి చలితీవ్రతకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జనవరి మొదటి వారం నుండి సాధారణ ఉష్ణోగ్రతలు పెరిగి చలితీవ్రత తగ్గగా సంక్రాంతి పండగ వేళ చలిగాలులు వీయడంతో ఎముకలు కొరికే చలికి సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఉట్నూరు, జనవరి 15: ఆదిలాబాద్ జిల్లాలో మెస్రం వంశీయులు ఆరాధ్య దైవమైన నాగోబా జాతర మరో పది రోజుల్లో ప్రారంభం కానుండగా ఇందుకు సంబంధించిన సౌకర్యాలు, ఏర్పాట్లు నత్తనడకన కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే నాగోబా జాతర ఈనెల 27వ తేదీ అర్ధరాత్రి గిరిజన సంస్కృతి, సంప్రదాయాల వధ్య ప్రారంభం కానుండగా ఇప్పటివరకు పనులు అంతంతా మాత్రంగానే జరుగుతున్నాయి.
నిజామాబాద్, జనవరి 15: డబ్బులను కూడబెట్టుకునేందుకు నేర ప్రవృత్తిని ఎంచుకుని లెక్కకుమిక్కిలి నేరాలకు పాల్పడిన గ్యాంగ్స్టర్ నరుూం పోలీసుల ఎన్కౌంటర్లో హతమైనప్పటికీ, అతని ముఠాకు చెందిన సభ్యులు నిజామాబాద్ జిల్లాలో సంచరిస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.
హైదరాబాద్, జనవరి 15: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సైబర్ సెక్యూరిటీ అత్యంత ప్రాముఖ్యత కలిగిన కీలక అంశం. ఆన్లైన్ ఖాతాలైనా, సోషల్ మీడియా అకౌంట్లపైనా ఇప్పటికే ఎన్నో సైబర్ దాడులు జరిగాయి. సైబర్ నేరగాళ్లు ఎంతో మంది ఖాతాలను తస్కరించి బ్యాంకుల్లోనూ, ఏటిఎంలలోగల డబ్బును కాజేశారు. ఎంతో మంది బాధితులు సిసిఎస్, సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది.
హైదరాబాద్, జనవరి 15: పే టిఎమ్ సంస్థ డిజిటల్ చెల్లింపులను విస్తరించడంలో భాగంగా ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు, క్యాంటీన్లు, పార్కింగ్ ప్రదేశాలకు ప్రత్యేక టూల్స్ను ఏర్పాటు చేసిందని ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ వాసిరెడ్డి తెలిపారు. ప్రతి రోజూ తమ సంస్థ ద్వారా 20వేల లావాదేవీలు జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరకు నెలకు 20 లక్షలకు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
హైదరాబాద్, జనవరి 15: దేశంలో ప్రైవేట్ రంగంలో ఎఫ్ఎం రేడియో స్టేషన్ల ద్వారా వార్తల ప్రసారానికి అనుమతించడం వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదాలు లేకపోలేదని ప్రసార భారతి చైర్మన్ ఏ సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఎఫ్ఎం రేడియో స్టేషన్లకు వార్తల ప్రసారానికి అనుమతి ఇచ్చే ముందు ప్రభుత్వం దీని వల్ల తలెత్తే పరిణామాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన అన్నారు.
అల్లాదుర్గం, జనవరి 15: సంక్రాంతి పండుగ రోజు అంతా ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటుండగా కుటుంబ కలహాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెరువులో పడి మృతి చెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.