S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/07/2016 - 03:13

విజయవాడ, ఆగస్టు 6: ఆంధ్రప్రదేశ్‌లో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆప్షన్ల నమోదు ప్రక్రియ శనివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలిసారిగా విద్యార్థులు నెట్ సెంటర్లు, హెల్ఫ్‌లైన్ సెంటర్ల నుంచి ఆప్షన్లను ఎంచుకోటం ప్రారంభించారు. 6,7 తేదీల్లో 1 నుంచి 5వేల ర్యాంక్ వరకు, 7,8 తేదీల్లో 5001 నుంచి చివరి ర్యాంకు వరకు ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంది.

08/07/2016 - 03:12

కావలి, ఆగస్టు 6: ప్రాణాంతకమైన అణువిద్యుత్ కేంద్రాలను అంతర్జాతీయంగా ఒక్కొక్క దేశం నిలుపుదల చేసుకొంటూ వస్తుంటే మన దేశంలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో నెలకొల్పాలని చంద్రబాబు సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని, ఈ ప్రయత్నాలను ప్రజలతో కలిసి అడ్డుకుంటామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

08/07/2016 - 03:07

హైదరాబాద్, ఆగస్టు 6: ఎన్నో న్యాయ వివాదాల్లో చిక్కుకున్న 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ 13 నుంచి 23 వరకూ నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్ణయించింది. శనివారం 2011 గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెల్లడించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపిపిఎస్సీ ఇప్పటికే మెయిన్స్ పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది.

08/07/2016 - 03:07

హైదరాబాద్, ఆగస్టు 6: తెలంగాణ జల వనరులకు సంబంధించిన ప్రతి సమాచారం ప్రజల ముందుంచడానికే ఇస్రోతో అవగాహన కుదుర్చుకున్నట్టు నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. ఇదొక చారిత్రక ఘట్టమన్నారు. తెలంగాణ జల వనరుల సమాచారం క్రోడీకరణకు ఒప్పందం ఉపయుక్తమన్నారు. శనివారం గ్రాండ్ కాకతీయ హోటల్‌లో తెలంగాణ నీటిపారుదల శాఖ, ఇస్రోల మధ్య ఒప్పందం కుదిరింది.

08/07/2016 - 03:05

హైదరాబాద్, ఆగస్టు 6: భారతదేశం పెను సవాళ్లను ఎదుర్కొంటోందని, అందులో అతిపెద్ద సవాలు ఉన్నత న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ అన్నారు. నల్సార్ వర్శిటీ 14వ స్నాతకోత్సవానికి హాజరైన జస్టిస్ ఠాకూర్ ముఖ్య అతిధిగా మాట్లాడారు. దేశంలో వివిధ న్యాయస్థానాల్లో 3 కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, 1300మంది

08/07/2016 - 02:50

కర్నూలు, ఆగస్టు 6: కర్నూలు జిల్లాలోని సప్తనదీ సంగమేశ్వరుడు జలాధివాసంలోకి వెళ్లిపోయారు. గత ఎనిమిది నెలలుగా భక్తుల పూజలతో కళకళలాడిన ఆలయం శనివారం కృష్ణాజలాల్లో మునిగిపోయింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 840 అడుగులకు చేరుకోగానే ఆలయంలోకి నీరు ప్రవేశించింది. శనివారం ఉదయానికి ఆలయం మొత్తం నీట మునిగి శిఖరం మాత్రమే దర్శనమిస్తోంది. మరో 10 అడుగుల మేర నీటిమట్టం పెరిగితే శిఖరం కూడా మునిగిపోతుంది.

08/07/2016 - 02:49

విజయవాడ, ఆగస్టు 6: కృష్ణా పుష్కరాల సందర్భంగా గతంలో ఇప్పటివరకు జరిగిన ఏ పుష్కరాల్లోను లేని విధంగా ఈ దఫా విజయవాడ నగరం సిసి కెమెరాల నిఘా నీడలోకి వెళ్లింది. రాజమండ్రి పుష్కరాల్లో చోటుచేసుకున్న దురదృష్టకర సంఘటనలు మరోవైపు సంఘవిద్రోహులు, తీవ్రవాదుల నుంచి ముందస్తు రక్షణకై ఒక్క విజయవాడ నగరంలోనే దాదాపు 2400 పైగా సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఇప్పటికే అత్యధికం ఏర్పాటయ్యాయి.

08/07/2016 - 02:46

రియో డి జెనీరోలో 31వ ఒలింపిక్స్ ఆరంభం అదిరిపోయింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున మొదలైన ప్రారంభోత్సవ కార్యక్రమంలో బ్రెజిల్ సంప్రదాయ సంగీత, నృత్య రూపకాలు అలరించాయి. భారత బృందానికి త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని ఏస్ షూటర్ అభినవ్ బింద్రా నాయకత్వం వహించాడు. ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న బ్రెజిల్ ఒలింపిక్స్‌కు సమర్థంగా ఆతిథ్యమిస్తుందా? అన్న అనుమానాలకు ప్రారంభోత్సవ వేడుక తెరదించింది.

08/07/2016 - 02:44

అనంతపురం, ఆగస్టు 6: ‘రాష్ట్రంలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఉపాధి కష్టమైంది. యంత్రాలు రావడంతో చేనేతకు ఆదరణ తగ్గిపోతోంది. ఈ పరిస్థితుల్లో చేనేత కార్మికుల్ని అన్నివిధాలా ఆదుకుంటాం. వారి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

08/07/2016 - 02:39

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై త్వరలోనే ఒక స్పష్టత వస్తుందనే ఆశాభావాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, నీతి ఆయోగ్ అధ్యక్షుడు పణిగరియా కసరత్తు చేస్తున్నారని చెప్పారు.

Pages